బాలీవుడ్ నటి కావ్య థాపర్ ఇటీవలే “ఏక్ మినీ కథ” చిత్రంతో ఆడియెన్స్ ను పలుకరించింది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా సాగే ఈ కథ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈమె నటనా నైపుణ్యం చూసిన పలువురు సినీ నిర్మాతలు ఈమెకు మరికొన్ని సినిమాలు అవకాశాలను కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ బాలీవుడ్ బామ ప్రస్తుతం మూడు హిందీ చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్నట్లు ఫిలిం నగర్ టాక్.
ఈ క్రమంలోనే తెలుగు ఇండస్ట్రీ నుంచి ఈమెకు ఘన స్వాగతం లభించింది.ఈ క్రమంలోనే తన నటనతో తెలుగు ప్రేక్షకులను సైతం మైమరిపించాలనే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే తెలుగు హీరోల గురించి వారిపై తనకున్న అభిప్రాయాన్ని బయట పెట్టింది.
Also read:ప్రేమకు వయసుతో పనిలేదు.. అది కేవలం నెంబర్ మాత్రమే: నటి సురేఖ వాణి
టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకు మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టమని, వారి చేసే డాన్స్ తనకు ఎంతగానో నచ్చుతుందని తెలిపారు. అదేవిధంగా తెలుగు ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, నాచురల్ స్టార్ నాని ఈ ముగ్గురు హీరోలతో తనకు నటించాలనే కోరిక ఉందని తన మనసులో మాటను “ఏక్ మినీ కథ”
నటి కావ్య థాపర్ బయటపెట్టారు.
Also read:వీలైనంత వరకు మాంసం తగ్గించండి అంటున్న.. స్టార్ హీరోయిన్?