రష్మిక మందన్న.. పరిచయం అవసరం లేని బ్యూటీ క్వీన్. తన నటనతో తెలుగు, తమిళ్ అనే కాకుండా సౌత్ ఇండియా మొత్తాన్ని ఒక ఊపు ఊపిన హీరోయిన్ తను. ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోయే అమ్మడు.. ఎప్పుడు నవ్వుతూ నవిస్తూ.. ఉంటుంది.
అయితే ఇప్పుడు ఈ చిన్నది.. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ లోకి పోయింది. బాలీవుడ్ లో తొలిసారిగా ఒక ఆల్బమ్ లో నటించింది. టాప్ టక్కర్ అనే పేరుతో ఈ వీడియో ఆల్బమ్ను మేకర్స్ తెరకెక్కించారు. దీనికి సంబంధించిన టీజర్ ఇప్పుడు యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది.ఈ ఆల్బమ్ పూర్తి పాటను త్వరలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలుపుతున్నారు.
ఈ ఆల్బమ్ పాటను పాపులర్ మ్యూజిషియన్ బాద్షా, యువన్ శంకర్ రాజా, జోనితా గాంధీ పాడారు. రష్మిక తొలిసారిగా హిందీలో మ్యూజిక్ వీడియోతో సందడి చేయనుందని చెప్పాలి. దీనిపై రష్మిక స్పందిస్తూ.. మొదటిసారి నేనిలాంటి వీడియో చేశాని తెలిపింది. ఈ ఆల్బమ్ త్వరలో విడుదల కాబోతుందని తెలిపింది. వేడుకలల్లో ఈ పాటే వినిపిస్తుందని నమ్ముతున్నానని పేర్కొంది. అలాగే ఈ పాటలో మంచి డ్యాన్స్ చేశానని పేర్కొంది.