Friday, May 17, 2024
- Advertisement -

తెలివి గా సమాధానం ఇచ్చిన రష్మిక

- Advertisement -

రష్మిక మందన్న పేరు వింటే చాలు గీత గోవిందం లో ఆమె చేసిన నటన గుర్తొస్తుంది మనకి. అయితే రష్మిక మందన్న మొదటగా చలో అనే సినిమా తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా లో నాగ శౌర్య సరసన నటించి హీరోయిన్ గా మంచి మార్కులే సంపాదించింది. అయితే అనూహ్యంగా ఆ తర్వాత విజయ్ దేవరకొండ సినిమా లో అవకాశం రావడం,ఆ సినిమా బ్లాక్బస్టర్ అవ్వడం, రష్మిక కి స్టార్డం రావడం ఒక్కసారిగా జరిగిపోయాయి. ఆ మధ్యలో దేవదాస్ అనే సినిమా చేసినా రష్మిక కి గీత గోవిందం విజయం మంచి స్థానం సంపాదించుకొనేందుకు దోహదపడింది. ఇప్పుడు తెలుగు లో రష్మిక స్టార్ హీరోయిన్. మహేష్ బాబు తో సరిలేరు నీకెవరు అనే సినిమా లో కూడా నటిస్తుంది.

అయితే ఆసక్తికరం గా రష్మిక తన పారితోషికాన్ని 40 లక్షల నుండి కోటి రూపాయలకి పెంచేయడం గురించి ఇండస్ట్రీ లో అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇదే విషయాన్ని ఈ మధ్య రష్మిక దగ్గర కూడా ప్రస్తావించగా, దానికి రష్మిక తెలివిగా సమాధానం ఇచ్చింది. తనకి డిమాండ్ ఉంది కాబట్టే కదా ఇస్తున్నారు అని, ఇంకా ఎక్కువ అడిగినా ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధం గా ఉన్నారని, తను కూడా ఇంకా కష్టపడి ప్రేక్షకుల ని మెప్పించగలను అని తెలివిగా సమాధానము ఇచ్చిందట. అయితే రష్మిక చెప్పింది కూడా కరెక్ట్. డిమాండ్ లో ఉన్నప్పుడే పారితోషికం పెంచకపోతే రేపు అవకాశాలు లేనప్పుడు ఇచ్చే వాళ్ళు ఉండరు కదా..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -