మాస్ మహారాజ్ రవితేజ హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘నేల టిక్కెట్టు’ సినిమా రూపొందింది. త్వరలో ఈ సినిమా ధియేటర్లలో సందడి చేసేందుకు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నేల టికెట్’ ఫస్ట్లుక్ను ఉగాది సందర్భంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే.
రవితేజ సరసన మాళవిక శర్మ కథానాయికగా నటించింది. ఈ సినిమా ఆడియో వేడుకతో అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఆడియో వేడుక తేదీ, ప్లేస్ను ఖరారు చేసింది సినిమా యూనిట్. నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో, ఈ నెల 10వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఈ వేడుకను ఆరంభించనున్నారు.
అభిమానుల సమక్షంలో జరిగే ఈ వేడుకకి పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా రానున్నాడు. దర్శకుడిగా కల్యాణ్ కృష్ణ ఇప్పటికే రెండు హిట్లు కొట్టేసి వున్నాడు. అందువలన ఆయన ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలనే పట్టుదలతో వున్నాడు. ఇక ఈ సినిమా తన కెరియర్ కి మంచి హెల్ప్ అవుతుందని మాళవిక శర్మ భావిస్తోంది. మాస్ మహరాజా రవితేజ ఎంతమేరకు ప్రేక్షకులను మెప్పిస్తాడో చూడాలి.