ఈ మధ్యకాలంలో సాధారణ సినిమాలతో పోలిస్తే మల్టీ స్టారర్ చిత్రాలను చూడటానికి ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇద్దరు హీరోలను ఒకే తెరపై చూపిస్తుండడంతో ప్రేక్షకులు కూడా ఈ సినిమాలపై ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే మల్టీస్టారర్ చిత్రాలు కూడా బాగా హిట్ అవడంతో దర్శక నిర్మాతలు సైతం ఇలాంటి చిత్రాలను తెరకెక్కించడానికి మొగ్గు చూపుతున్నారు.
ఇప్పటికే ఎన్నో మల్టీస్టారర్ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోగా తాజాగా మరో మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఎనర్జిటిక్ స్టార్ రామ్,మాస్ మహారాజ రవితేజ ఇద్దరూ కలిసి ఓ మల్టీస్టారర్ చిత్రం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది క్రాక్ ఈ సినిమాతో ఫుల్ జోష్ లో ఉన్న రవితేజ తరువాత రమేశ్ వర్మ డైరెక్షన్లో ‘ఖిలాడీ’ అనే సినిమాలో నటిస్తున్నారు.
Also read :కరోనా సమయంలో పెళ్లి వేడుకలు… ఎమోషనల్ అయినా యాంకర్ ఝాన్సీ!
ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఏడాది రెడ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తరువాత రామ్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ ఇంకా ప్రకటించలేదు. అయితే ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత ఈ ఇద్దరు హీరోలు కలిసి ఫుల్ ఫామ్ లో ఉన్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో మల్టీస్టారర్ చిత్రం చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.