Monday, April 29, 2024
- Advertisement -

కరోనా సమయంలో పెళ్లి వేడుకలు… ఎమోషనల్ అయినా యాంకర్ ఝాన్సీ!

- Advertisement -

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎలాంటి ఈ పరిస్థితులు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రోజుకు లక్షల సంఖ్యలో కేసులు నమోదు కాగా వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. అయితే వచ్చే నెల పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఎంతో మంది పెళ్లిళ్లు ఎంతో ఆర్భాటంగా చేసుకోవాలని కలలు కన్నారు. అయితే వారి కలలు కలలుగానే మిగిలిపోయాయి కేవలం కొంత మంది సమక్షంలో మాత్రమే పెళ్లి చేసుకునే పరిస్థితులు తలెత్తాయి.

ఒకప్పుడు పెళ్ళంటే ఆకాశమంత పందిరి భూదేవంత పీటలు వేసి ఎంతో ఘనంగా జరిగేవి.ప్రస్తుతం తలెత్తుతున్న ఈ పరిస్థితులు పెళ్లి రూపురేఖలను మార్చేసే ప్రతి ఒక్కరు తమ పెళ్లిని ఆన్లైన్ లో చూసే విధానాన్ని తీసుకువచ్చారంటూ యాంకర్ ఝాన్సీ తన ఇంట్లో జరిగే పెళ్లి వేడుకలు గురించి తెలిపారు.

Also read:విరామ సమయంలో ఆ పనిలో బిజీగా గడుపుతున్న. కాజల్

యాంకర్ ఝాన్సీకి వరుసకు కొడుకైన సంపత్ నిశ్చితార్థం నేడు జరిగింది. అయితే ఈ వేడుకను తాను స్వయంగా కాకుండా లైవ్ లో చూడాల్సిన పరిస్థితి ఎదురైంది అంటూ ఆమె తెలిపారు.నేను అక్కడ లేకపోయినా కూడా వాటికి తగ్గట్టే రెడీ అయ్యాను. మా కుటుంబంలోకి నీకు స్వాగతం. కేవలం కొంత మంది కుటుంబ సభ్యుల సమక్షంలో వారికి కూడా నెగిటివ్ అని వచ్చిన తర్వాతే ఈ కార్యక్రమానికి హాజరయ్యి నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుక ఇంట్లోనే జరిగింది. ఈ విధంగా ఈవెంట్ లైవ్ లో చూడడం కొత్తది అయినా నేర్చుకుంటున్నాం.. కష్టమైన తప్పడం లేదంటూ ఝాన్సీ ఎమోషనల్ అయ్యారు.

Also read:అభిమాని మరణ వార్తతో భావోద్వేగానికి గురైన ..విజయ్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -