ఐదు పదుల వయస్సులోనూ వరుస సినిమాలతో సత్తాచాటుతున్నారు మాస్ మహారాజా రవితేజ. ప్రస్తుతం రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు విడుదలకు సిద్ధంగా ఉండగా ఇది రవి కెరీర్లో తొలి పాన్ ఇండియా చిత్రం. స్టువర్టుపురం గజదొంగ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా వస్తోంది.
ఇక తాజాగా ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం ప్రకారం రవితేజ మరో బయోపిక్లో నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వన్డే ప్రపంచకప్ జరుగుతుండగా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా క్రికెట్ కామెంటరీ చెప్పారు రవితేజ. ఈ సందర్భంగా క్రికెట్ అంటే తనకు ఇష్టమని చెప్పిన మాస్ మహారాజా ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
తనకు క్రికెటర్ బయోపిక్లో నటించే అవకాశమొస్తే…సిరాజ్ బయోపిక్లో నటిస్తానని చెప్పాడు. ఇక సిరాజ్ హైదరాబాదీ కాగా బౌలింగ్ విభాగంలో నెంబర్ 1 ర్యాంకింగ్లో ఉన్నాడు. ఇక విరాట్ కోహ్లీ ఆటిట్యూడ్, దూకుడు అంటే ఇష్టమని చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు రవితేజ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారగా క్రికెట్ ఫ్యాన్స్కు ఇది నిజంగా గుడ్ న్యూస్. మరి సిరాజ్ బయోపిక్ని తెరకెక్కించే దర్శకుడు ఎవరు..ఆ మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుందో వేచిచూడాల్సిందే.