- Advertisement -
ఓ ప్రముఖ టీవీ యాక్టర్ పదిహేడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ముంబైలో జరిగింది.ముంబై నగరంలోని నల్లసోపర ప్రాంతానికి చెందిన ఆదిత్యగుప్తా (20) టీవీ రియాల్టీ షో నటుడు. అతనికి పదిహేడేళ్ల బాలిక పరిచయమైంది. బాలికతో ఛాటింగ్ చేస్తూ వచ్చాడు.
ఆదిత్య గుప్తా బాలికను నల్లసోపర ప్రాంతంలోని తన ఇంటికి తీసుకువెళ్లాడు. బాలికకు మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి మత్తులోకి వెళ్లగానే ఆమెపై ఆదిత్య అత్యాచారం చేశాడు. సీసీటీవీ ఫుటేజ్, ఫోన్ కాల్ డేటా ఆధారంగా నిందితుడైన టీవీ నటుడు ఆదిత్య గుప్తాను అరెస్టు చేశారు.