Sunday, April 28, 2024
- Advertisement -

రెండు లగ్జరీ కార్లను అమ్మేసిన రేణు దేశాయ్.. ఎందుకు ?

- Advertisement -

పవన్ మాజీ భార్య రేణూదేశాయ్‌కి మంచితనం ఎక్కువే. తన నచ్చని విషయాలను కుండబద్దలు కొట్టి చెప్పే రేణు.. నచ్చిన విషయలను కూడా అలానే అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఓ మంచి పని కోసం తన రెండు లగ్జరీ కార్లను అమ్మేసి నలుగురికి ఆదర్శంగా నిలిచింది రేణు దేశాయ్. మార్పు నాతోనే అంటూ కొత్త ఆలోచనకు తెరతీసింది. రేణు దేశాయ్ కి కార్లు అంటే చాలా ఇష్టం.

అందుకే ఆడి ఏ6, పోర్ష్ బాక్స్టెర్ లగ్జరీ కార్లను గతంలో కొనుగోలు చేసింది రేణూ దేశాయ్. అయితే పెట్రోల్ డీజిల్ కార్లు వాడితే పర్యావరణానికి ముప్పు అని.. పీల్చేగాలిలో కార్బన్ శాతం పెరిగిపోతుందని.. దీని వల్ల చాలా నష్టం జరుగుతుందని.. ఓ కథనం ద్వారా తెలుసుకున్న రేణు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ విపత్తుకి తన వంతు బాధ్యత వహిస్తూ.. తన దగ్గర ఉన్న రెండు లగ్జరీ కార్లను అమ్మేశారు రేణూ దేశాయ్. పెట్రోల్, డీజిల్‌‌తో నడిచే కార్లను కాకుండా విద్యుత్‌తో నడిచే ఎలక్ట్రికల్ కారును కొనుగోలు చేశారు.

కార్లు అమ్మడం కష్టంగా అనిపించినా, ఇంధనంతో భూమిపై నివసించే జీవరాశులు క్యాన్సర్ బారిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారామె. ఈ విషయంను ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ రిక్వెస్ట్ చేసింది. పర్యావరణాన్ని కాపాడాలంటే పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాల వాడకాన్ని తగ్గించాలని ఆమె విజ్ఞ‌ప్తి చేసింది. కోట్లుకి కోట్లు సంపాదిస్తూ.. నెలకో ఖరీదైన కారుతో చక్కర్లు కొడుతూ కనిపించే చాలామంది సినీ, రాజకీయ సెలబ్రిటీలకు రేణూ తీసుకున్న నిర్ణయం కనువిప్పు అనే చెప్పాలి. ఏది ఏమైన రేణు దేశాయ్ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని పవన్ ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు.

అతనితో విడిపోయాక చాలా రూమర్స్ వచ్చాయి : యాంకర్ ఝాన్సీ

ఆ పొట్ట ఏంట్రా అని స్టేజ్ మీదా ఆది పరువు తీసిన వర్షిణి..!

జబర్దస్త్ లో రోజా ఎందుకు కనిపించడంలేదో తెలుసా ?

‘ఛీ దరిద్రుడా.. తూ’ అని సుధీర్ పరువు తీసిన రష్మీ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -