మనం రైల్వే టికెట్, సినిమా టికెట్ బుక్ చేసుకున్నట్టు ట్రెండింగ్లో ఉన్న హీరోను బుక్ చేసుకున్నారు. ఆ సినిమా ఎక్కడ చేజారిపోతోరోనని హీరోకు అడ్వాన్స్ ఇచ్చేసి తర్వాత తమ సినిమా చేయాలని ఇచ్చుకున్నారట. ఆ హీరో ఎవరో కాదు అర్జున్రెడ్డి నటుడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం దాదాపు పది సినిమాలతో బిజీ బిజీగా విజయ్ ఉన్నాడు. అర్జున్రెడ్డి సినిమా విజయంతో దర్శక, నిర్మాతలు అతడితో సినిమాలు చేసేందుకు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం అర్జున్రెడ్డి తనకు వచ్చి అవకాశాలన్నింటిని చేసుకుంటూ పోతున్నాడు. వాటిని పూర్తిచేసే పనిలో విజయ్ దేవరకొండ బిజీగా ఉన్నాడు.
అయితే ఈ బుక్ చేసుకున్న వారెవరో తెలుసా.. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. ఈ సంస్థ విజయ్ దేవరకొండతో జూన్ తర్వాత ఓ సినిమా చేసేందుకు సిద్ధమవుతోంది. ఆ సినిమా కోసం అర్జున్రెడ్డికి రూ.రెండున్నర కోట్ల మొత్తాన్ని అడ్వాన్స్గా ఇచ్చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఛలో హీరోయిన్ రష్మికను తీసుకున్నారంట. ఇప్పటికే విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుండగా ఆ సినిమాలో రష్మిక నటిస్తోంది. అదే జోడీని మైత్రీ మూవీ మేకర్స్ సినిమాలో కనిపించనుంది.