Saturday, May 11, 2024
- Advertisement -

సాహో పై పెరుగుతూ వస్తున్న అంచనాలు

- Advertisement -

ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా సాహో. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ఈ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సుజిత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. బాహుబలి తర్వాత మళ్లీ అదే రేంజ్లో ప్రభాస్ నటిస్తున్న సినిమా సాహో. శ్రద్ధా కపూర్ ఈ సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయం కానుంది. సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతూనే వస్తున్నాయి. ఇక ఇక ప్రమోషన్స్ పేరుతో విడుదలైన టీజర్, ట్రైలర్ కూడా సినిమాకి మంచి పేరు తెచ్చిపెట్టాయి.

ఇప్పటికే అన్ని వెబ్సైట్లలో సాహో ప్రీ అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ హాట్ కేకుల్లా అమ్ముడు అయిపోయాయి. తెలుగు రాష్ట్రంలోనే కాక ‘సాహో’ సినిమా విడుదలైన ప్రతి చోట రికార్డులు సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు కూడా చెబుతున్నాయి. నీల్ నితిన్ ముకేష్, జాకీష్రాఫ్, మందిరా బేడి, అరుణ్ విజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాని యు.వి.క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఘిబ్రాన్ అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమాకి మరింత ప్లస్ కాబోతోంది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఆగస్టు 30 న విడుదలకు సిద్ధమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -