- Advertisement -
మంచు మనోజ్ శబరిమల తాజా వివాదంపై స్పందించారు.రుతుక్రమం జరిగే వయసున్న మహిళల కోసం అదనపు సౌకర్యాలను కల్పించేంతవరకు వారి ప్రవేశాన్ని నిరోధించాలని కోరుతూ చేసిన పిటిషన్ ని కేరళ హైకోర్టు కొట్టివేసింది. శబరిమలకి మహిళలను అనుమతించడాన్ని నిరసిస్తూ కేరళ వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదంపై ఇప్పటి వరకు మన తెలుగు హీరోలు స్పందిచకపోవడంపై ఓ నెటిజన్ మంచు మనోజ్, రామ్ చరణ్ అయ్యప్ప మాల వేసుకున్న ఫోటోని షేర్ చేశాడు.
దీనిపై స్పందించిన మనోజ్ ”పేదలకు తిండి, నీరు, చదువు వంటి సౌకర్యాలు అందడం లేదని మేమంతా చింతిస్తున్నాం.మనం ముందు వారి గురించి ఆలోచించాలి. మనందరికీ దేవుడిపై నమ్మకం ఉంది కదా.. అలాంటప్పుడు ఆయనకి వచ్చిన సమస్యను ఆయనే పరిష్కరించుకుంటాడు. మనమంతా మానవత్వం వైపు నిలబడతాం” అని వెల్లడించారు.