Sunday, May 19, 2024
- Advertisement -

రూమర్స్ ఇక చెక్!

- Advertisement -

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ బ్లాక్ బ్యూటీ రెజినా లు కలిసి  వరుసగా రెండు సినిమాల్లో నటించారు. ఈ రెండు సినిమాలు ఓ రెంజ్ లో హిట్ కొట్టడంతో వీరిద్దరు పీకల్లోతు ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. దీనికి తోడు తేజు రెజినా లు కలిసి పలు ఈవెంట్స్ కి కూడా హాజరు కావడంతో ఈ రూమర్స్ ఇంకా చెలరేగాయి.

ఈ విషయం ఇంతటితో ఆగకుండా తేజు ఒప్పుకునే ప్రతి సినిమాలో రెజినా నే హీరోయిన్ గా తీసుకోవాలని దర్శక నిర్మాతలను ఒత్తిడి చేస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు చూస్తే ఈ రూమర్స్ ఇక చెక్ పడ్డట్లే కనిపిస్తోంది. సాయి ధరం తేజ్ గోపి చంద్ మాలినేని దర్శకత్వంలో చేస్తున్న చిత్రం ఇటీవలే లాంచింగ్ కార్యక్రమాలు జరుపుకున్న విషయం తెలిసిందే.

ఈ చిత్రంలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ని తీసుకున్నారు మేకర్స్. అలాగే తేజు నటిస్తున్న మరో చిత్రం తిక్క లోకూడా వేరే హీరోయిన్ లారిస్సా బోనేస్సి నటిస్తోంది. మరో పక్క బ్లాక్ బ్యూటీ రెజినా చితిలో ఒకే ఒక్క తెలుగు సినిమా ఉంది. మొత్తానికి మెగా హీరో ఈ గాలి వార్తలకు శుభం కార్డ్ వేసేశాడనే తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -