Sunday, May 12, 2024
- Advertisement -

రవి తేజ హీరోయిన్ తో రొమాన్స్ చేయనున్న తేజు

- Advertisement -

చిత్రలహరి సినిమా విజయం తో వరుస పరాజయాలకు చెక్ పెట్టాడు సాయి ధరమ్ తేజ్. సాయి ధరమ్ తేజ్ పేరు ని కూడా స్క్రీన్ మీద సాయి తేజ్ గా మార్చుకున్న తేజు కి సక్సెస్ మొత్తానికి వరించింది. ప్రస్తుతం తేజు తన ధ్యాస అంతా తదుపరి చిత్రం పైన పెట్టాడు. మారుతీ దర్శకత్వం లో గీత ఆర్ట్స్ 2 బానర్ లో త్వరలో ఒక చిత్రం మొదలు కానుంది. అందులో సాయి ధరమ్ హీరో గా చేయనున్నాడు. శైలజ రెడ్డి అల్లుడు తర్వాత నాని, శర్వానంద్ ల తో సినిమా చేయాలనీ చూసిన మారుతీ కి ప్రాజెక్ట్స్ సెట్ అవ్వకపోవడం తో ఈ ప్రాజెక్ట్ ని లైన్ లో పెట్టాడు. ఈ సినిమా ఒక లైట్ హార్టెడ్ రొమాంటిక్ కామెడీ డ్రామా గా తెరకెక్కనుందట.

ప్రస్తుతం ఫిలిం నగర్ లో వినిపిస్తున్న కథనాల ప్రకారం నేల టికెట్ సినిమా లో మెరిసిన మాళవిక శర్మ ని ఈ సినిమా లో హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తుంది. మాళవిక శర్మ కి నేల టికెట్ మొదటి సినిమా. మొదటి సినిమా తో పెద్దగా మెప్పించకపోయినా ఈ రెండో సినిమా తో అయినా అందరి దృష్టి ని ఆకర్షించాలి అని చూస్తుంది మాళవిక. మరి కొద్ది రోజుల్లో ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన విడుదల కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -