ఫీల్ గుడ్ చిత్రాల డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ఫిదా.. ఇప్పుడు ఈ సినిమా.. రికార్డుల సృష్టిస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించగా.. హీరోయిన్ గా మలయాళ ప్రేమమ్ బ్యూటీ సాయి పల్లవి నటించింది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రధానంగా సాయి పల్లవి చేసిన యాక్టింగ్ ఈ సినిమాకో చాలా ప్లస్ అయింది. దాంతో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ హాట్ టాపిక్గా మారింది.
అయితే ఫిదా కోసం అమ్మడు తీసుకున్న మొత్తం ఎంతో తెలిస్తే షాక్ అవ్వడం మన వంతు. మాములుగా టాలీవుడ్లో ఫస్ట్ సినిమాకు కాస్త తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటారు. అయితే వారికి హిట్ వచ్చాక మాత్రం వారు తమ రెమ్యునరేషన్ ను పెంచుతారు. అయితే సాయి పల్లవికి టాలీవుడ్లో ఫిదా సినిమానే ఫస్ట్. కానీ అమ్మడు మలయాళంలో ప్రేమమ్ వంటి బ్లాక్బస్టర్ హిట్తో సౌత్ ఇండియా మొత్తం పాపులారిటీ సంపాధించిన ఈ బ్యూటీ, ఫిదా కోసం తీసుకున్న మొత్తం అక్షరాల 30 లక్షల రూపాయలు. అయితే సినిమా హిట్ కావడంతో అమ్మడు తన రెమ్యునరేషన్ను అమాంతం పెంచినట్లు తెలుస్తుంది.
ఇక నేచురల్ స్టార్ నానితో MCA(మిడిల్ క్లాస్ అబ్బాయి) సినిమా తన రెమ్యునరేషన్ను పెంచకుండా ఆ తరువాత తాను సైన్ చేయబోయే సినిమాలకు మాత్రం ఏకంగా 70 లక్షలు తీసుకోనుందట. మరి ఇంతటి కాస్ట్లీ సాయి పల్లవి తన నెక్ట్స్ సినిమాలతో ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తుందో చూడాలి. ఏది ఏమైన మొదతి సినిమాకే ఈ రెంజ్ రెమ్యనరేషన్ తీసుకున్న హీరోయిన్గా సాయి పల్లవి రికార్డు సృష్టించింది.