శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం సైంధవ్. సంక్రాంతి రేసులో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల ముందుకురాగా వెంకటేష్ కెరీర్లో ఇది 75వ సినిమా. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో రిలీజ్ అయింది.
ఇప్పటికే గుంటూరు కారం, హనుమాన్ సంక్రాంతి రేసులో ముందుకు రాగా తాజాగా సైంధవ్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అన్ని రకాల ఎమోషన్లతోపాటు యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయని చెబుతున్నారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్ లాక్ అయింది.
సైంధవ్ ఓటీటీ హక్కులను దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ను వెనక్కి నెట్టి మరి దక్కించుకుంది అమెజాన్. భారీ రేటుకు సైంధవ్ రైట్స్ను దక్కించుకోగా నాలుగు వారాల తర్వాత సినిమా ఓటీటీలో అందుబాటులోకి రానుంది. అంటే అమెజాన్ ప్రైమ్లో ఫిబ్రవరి రెండో వారంలో మహాశివరాత్రి సందర్భంగా లేదా మార్చిలో అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది.