బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా పరిచియమై చాలా కాలం అయిన సరైన హిట్ మాత్రం రావడం లేదు.’జయ జానకి నాయక’ సినిమాతో ఫర్వాలేదనిపించుకున్నాడు.ఈసారి ఎలాగైనా సరే హిట్ కొట్టలనే కసితో డిఫరెంట్ కాన్సెప్ట్ ‘సాక్ష్యం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.ఈ సినిమాకు శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను జూన్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమా పంచభూతాల నేపథ్యంలో తెరకెక్కుతుంది.దీనికి సంబంధించి సినిమాలో ఐదు భారీ ఫైట్లు ఉంటాయని తెలుస్తుంది. అంతేకాదు ప్రతీ ఫైట్ క్లైమాక్స్ అనిపించేంత భారీగా తెరకెక్కించారు. ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ ఒక్క ఫైట్ను డిఫరెంట్గా రూపొందించారట.ఈ సినిమాలో హీరోయిన్గా హెగ్డే హీరోయిన్ నటిస్తుంది. శరత్ కుమార్, జగపతి బాబులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.