Friday, April 26, 2024
- Advertisement -

ఆ టైటిల్ మహేశ్ కు నచ్చలేదా.. త్రివిక్రమ్ ప్లాన్ ఏంటి ?

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ జరుగుకుంటున్న ఈ మూవీ మొదటి మొదటి షెడ్యూల్ కూడా కంప్లీట్ అయింది. మొదటి షెడ్యూల్ లో హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించిన త్రివిక్రమ్.. ఇక రెండో షెడ్యూల్ ను దసరా తరువాత మొదలు పెట్టనున్నాడు. ఇక ఈ షెడ్యూల్ లో హీరోయిన్ పూజా హెగ్డే జాయిన్ అవ్వనుంది. అయితే తాజాగా మహేష్ బాబు తల్లి ఇందిర దేవి మరణించడంతో మహేష్ బాబు కొన్ని రోజులు షూటింగ్ కు బ్రేక్ ఇచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఈ సినిమా టైటిల్ పై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. “SSMB28 ” వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పై ఉన్న ఈ మూవీకి అర్జునుడు అనే టైటిల్ గత కొన్ని రోజులుగా వినిపిస్తోంది.

అయితే ఈ టైటిల్ కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. త్రివిక్రమ్ తన సినిమాలకు ” ఆ ” సెంటిమెంట్ ఉండడంతో మహేష్ మూవీకి ” అర్జునుడు ” టైటిల్ దాదాపుగా ఫిక్స్ అయినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ” అర్జునుడు ” టైటిల్ కాస్త ఓల్డ్ గా ఉండడంతో మహేష్ ఈ టైటిల్ పై కాస్త అసంతృప్తిగా ఉన్నాడట. దీంతో గురూజీ టైటిల్ కు మరింత మెరుగులు దిద్దే ప్రయత్నం చేస్తున్నాడట. ఇక మూవీ స్టోరీకి సెట్ అయ్యే విధంగా యూనిక్ టైటిల్ ను త్రివిక్రమ్ పరిశీలిస్తున్నాడట. ఈ నేపథ్యంలో ” అయోద్య లో అర్జునుడు ” అనే టైటిల్ కు చిత్రా యూనిట్ దాదాపుగా ఫిక్స్ అయినట్లు సమాచారం. ఈ మూవీ టైటిల్ తో పాటు మహేష్ బాబు న్యూ లుక్ పోస్టర్ ను కూడా ఈ దసరా కానుకగా ప్రకటించేందుకు చిత్రా యూనిట్ సిద్దమైనట్లు సమాచారం. మరి దాదాపు పన్నెండేళ్ళ తరువాత త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రెల్ 28 న విడుదల కానుంది.

Also Read

విలన్ గా ఎన్టీఆర్.. హీరో ఎవరో తెలుసా ?

వీరి జోడీ.. భలే బాగు!

సీనియర్స్ పని అయిపోయినట్లేనా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -