Friday, May 3, 2024
- Advertisement -

చైతు సమంతాలకు దగ్గుబాటి స్పెషల్

- Advertisement -

మన టాలీవుడ్ స్వీట్ కపుల్ చైతూ-సమంతాలు ఆఫ్టర్ మ్యారీజ్ హనీమూన్ కు వెళ్ళిపోయిన సంగతి మనకు తెలిసిందే. పెళ్ళి తరువాత వీళ్లిద్దరి పబ్లిక్ దర్శనాలు అస్సలు లేవు. దీంతో సమంతా డార్లింగ్ ఫ్యాన్స్ …తల్లి నీ దర్శనాలు ఎప్పుడంటూ గోల పెట్టేస్తున్నారు. కరెక్ట్ గా టైమ్ చూసిన మనవాళ్లు… చైతు సమంతాల పిక్స్ ను సోషల్ మీడియాకు లీక్ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే వీటిని లీక్ అవ్వడం అనరు. వారి అంగీకారంతోనే వచ్చిన చిత్రాల మాదిరిగా అనిపిస్తున్నాయి.

ఈ పిక్స్ బయటకు రావడానికి ముందు ”అక్కినేని ఇంట్లో వంట చేస్తున్నా.. ఇక్కడంతా క్షేమం” అంటూ సమ్మూ సెటైర్లు అయితే వినిపించాయి. సడన్ గా.. ఈ కపుల్ కి సంబంధించి కొన్ని ప్లెజెంట్ ఫోటోలు మీడియాలో తళుక్కుమంటూ మెరుస్తున్నాయి. పెళ్లి తర్వాత అక్కినేని, దగ్గుబాటి కుటుంబం ఒక్కచోట కలిసిన సందర్భం లేదు.

బట్ ఇక్కడ మాత్రం వెంకటేశ్‌, రానా, లక్ష్మిలతో చైతూ, సమంత కలిసి సందడి చేసినట్లు ఫోటోలు చెబుతున్నాయి. ఇప్పుడీ రేర్ పిక్స్ సోషల్ మీడియాను దున్నేస్తున్నాయి. ఇంతకీ ఈ ‘గెట్‌ టు గెదర్‌’ పార్టీ ఎక్కడనే కదా మీ డౌట్ . ఇంకెక్కడ దగ్గుబాటి సురేష్ బాబు తన ఫ్యామిళీ కోసం ఎరేంజ్ చేసిన ఈవెంట్ లో దొరికిన చిత్రాలివి. కేవలం సురేష్ బాబు బందుగణం అంతా ఈ పార్టీని ఎంజాయ్ చేశారు. ఈ పార్టీలో అక్కినేని వారెవరు కనిపించలేదు. ఒక్క చైతు తప్ప.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -