Monday, May 13, 2024
- Advertisement -

ఒక్క హిట్ తో బిజీగా మారిన కుర్ర హీరో!

- Advertisement -

ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రస్తుతం కొత్త హీరోల జోరు నడుస్తుంది. చిన్న చిత్రాలు అయినా మంచి కాన్సెప్ట్ ఉండటంతో తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. కామెడీ ఎంటర్టైనర్లు, ఫ్యామిలీ జోనర్ సినిమాలు చేస్తూ విజయాలను అందుకుంటున్నారు. ఇక దర్శకుడు శోభన్ తనయుడు సంతోష్ శోభన్ నటించిన ‘తను నేను’ .. ‘పేపర్ బాయ్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచాడు. తాజాగా ‘ఏక్ మినీ కథ’ అమెజాన్ ప్రైమ్’ ద్వారా విడుదలైంది. బోల్డ్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఈ సినిమా బయటికి రాకముందే ఈ కుర్రాడు వరుస సినిమాలను లైన్లో పెట్టేయడం విశేషం. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ యూవి క్రియేషన్స్ ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తూనే మరోవైపు యూవి కాన్సెప్ట్స్ అనే న్యూ బ్యానర్ పై చిన్న సినిమాలను నిర్మిస్తోంది. వైజయంతీ మూవీస్ బ్యానర్లో .. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో సంతోష్ శోభన్ సినిమాలు చేయనున్నాడు.

అలాగే ఓ డెబ్యూ డైరెక్టర్ తో ఓ సినిమా చేయనున్నాడట. వీటన్నిటితో పాటుగా సారంగ ప్రొడక్షన్స్ బ్యానర్ లో అభిషేక్ మహర్షి అనే నూతన దర్శకుడితో ఓ సినిమా చేయనున్నాడని స్వయంగా వెల్లడించాడు. అలాగే నందినీ రెడ్డి దర్శకత్వంలోను సినిమాలు చేయనున్నాడు. ఇలా వరుస సినిమాలను లైన్ లో పెట్టిన ఈ కుర్ర హీరో కెరియర్ ను పక్కగా ప్లాన్ చేసుకుంటున్నాడు.

క‌రోనాతో అనాథ‌లైన చిన్నారుల సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం!

నేటి పంచాంగం,సోమవారం (31-05-2021)

ఈటల బీజేపీలో చేరడం పక్కా.. అందుకే ఢిల్లీ వెళ్లారా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -