Wednesday, April 24, 2024
- Advertisement -

ఈటల బీజేపీలో చేరడం పక్కా.. అందుకే ఢిల్లీ వెళ్లారా?

- Advertisement -

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఢిల్లీకి వెళ్లారు. గత కొద్ది రోజులుగా ఆయన బీజేపీలో చేరతారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. తాజాగా తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొని తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌కు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఢిల్లీకి వెళ్లడంతో రాజకీయాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఈటల తో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లారు. వీరిద్దరిని బీజేపీ సీనియర్ నాయకుడు,పెద్దపల్లి మాజీ ఎంపి వివేక్ ఢిల్లీ తీసుకెళ్లారు. మరోవైపు.. హైదరాబాద్‌లో పలు కార్యక్రమాలకు హాజరయిన కేంద్ర హోం సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడ ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రేపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర మంత్రి అమిత్ షాలతో ఈటల భేటీ కానున్నట్లు తెలుస్తోంది. వారిని కలసిన తర్వాత ఈటల ఓ నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మొత్తం పరిణామాల నేపధ్యంలో రేపు ఈటల బీజేపీ కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

తమిళనాడులో శ‌శిక‌ళ కీలక నిర్ణ‌యం!

తెలంగాణలో 10 రోజుల పాటు లాక్ డౌన్ పొడిగింపు.. ఒంటి గంట వరకు అనుమతి!

ఆనందయ్య మందుపై స్పందించిన చిన జీయర్ స్వామి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -