ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి రావడం.. వచ్చినా ఇక్కడ నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు. ప్రత్యేకమైన ప్రతిభా పాటవాలు ఉంటేనే అది సాధ్యం. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చిన్న చిన్న పాత్రల్లో నటించిన సత్యదేవ్.. అనతి కాలంలోనే తనను తాను నిరూపించుకున్నాడు. మిల్కీ బ్యూటీ తమన్నాతో నటించే అవకాశం దక్కించుకున్నాడు. సత్యదేవ్, తమన్నా హీరోహీరోయిన్లుగా.. గుర్తుందా శీతాకాలం అనే సినిమా వస్తున్న విషయం తెలిసిందే. అయితే సత్యదేవ్ బాలీవుడ్లోకి అడుగుపెట్టబోతున్నట్టు సమాచారం.
సత్యదేవ్ బాలీవుడ్లో ఓ సినిమాలో నటించబోతున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. కానీ వాటికి సంబంధించి అధికారిక ప్రకటన రాలేదు. అయితే తాజాగా సత్యదేవ్ ఈ విషయాన్ని చెప్పారు. నిన్న ఆయన పుట్టినరోజు .. ఈ సందర్భంగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సత్యదేవ్ మాట్లాడుతూ.. బాలీవుడ్లో రామసేతు అనే చిత్రంలో నటిస్తున్నట్టు సత్యదేవ్ ప్రకటించాడు.
Also Read: ‘మేజర్’ మార్కెట్ మామూలుగా లేదుగా..
ప్రస్తుతం తిమ్మరసు, గాడ్సే, స్కైలాబ్ లాంటి ప్రాజెక్టులతో అతను బిజీగా ఉన్నాడు. అయితే అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న రామ్ సేతులో నటిస్తున్నట్టు సత్యదేవ్ స్వయంగా ధ్రువీకరించాడు. అంతేకాక ప్రస్తుతం “తిమ్మరసు షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. ‘గాడ్సే’ షూటింగ్ చివరి దశలో ఉంది. ‘స్కైలాబ్’ షూటింగ్ అయిపోయింది. మొత్తానికి వరస అవకాశాలతో సత్యదేవ్ దూసుకుపోతున్నాడు.
Also Read: బన్నీ నుంచి మరో పాన్ ఇండియా మూవీ..!