Sunday, April 28, 2024
- Advertisement -

రెండవ రోజు డీసెంట్ కలెక్షన్స్ కలెక్ట్ చేసిన ఉప్పెన..!

- Advertisement -

మెగా మేనల్లుడు సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన తొలి సినిమా “ఉప్పెన”.కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేశాడు. ఇక ఈ సినిమాని ‘మైత్రి మూవీ మేకర్స్’ మరియు ‘సుకుమార్ రైటింగ్స్’ బ్యానర్ల పై నవీన్ యర్నేని, వై.రవి శంకర్, సుకుమార్ లు కలిసి నిర్మించారు. ఇక ఈ చిత్రం ఫిబ్రవరి 12న(నిన్న) విడుదలవ్వడం జరిగింది.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని…’నీ కన్ను నీలి సముద్రం’ అనే పాట మొదటి సినిమా పై అంచనాలు పెరిగేలా చేసింది. ఇక టీజర్, ట్రైలర్ లు అయితే ఆ అంచనాలను డబుల్ చేశాయనే చెప్పాలి.దాంతో మొదటి రోజు ఈ చిత్రానికి అదిరిపోయే ఓపెనింగ్స్ నమోదయ్యాయి. ఇక రెండవ రోజు కూడా వసూళ్లు బాగానే రాబట్టింది..

‘ఉప్పెన’ చిత్రానికి 20.5 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది కాబట్టి.. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 21కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండు రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 17.35 కోట్ల షేర్ ను రాబట్టి స్ట్రాంగ్ గా రన్ అవుతోంది. ఆదివారం రోజున కూడా ఈ చిత్రం బుకింగ్స్ ఓ రేంజ్లో ఉన్నాయి. చూస్తుంటే మూడు రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ ను సాధించి హిట్ లిస్ట్ లోకి చేరిపోయేలా ఉంది.

అల్లు అర్జున్ కు పోటీగా మంచు మ‌నోజ్ !

పద్మశ్రీ అవార్డు గ్రహీత జొన్నలగడ్డ గుర్రప్ప శెట్టి కన్నుమూత?

గుండెల్ని పిండేలా చైతూ సాయిప‌ల్ల‌వి ల‌వ్ స్టోరీ సాంగ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -