Saturday, May 18, 2024
- Advertisement -

ప్రాణం తీసిన అర‌వింద స‌మేత‌

- Advertisement -

యంగ్ టైగ‌ర్ న‌టించిన అర‌వింద స‌మేత విడుద‌లై మంచి విజ‌యాన్ని సాధించింది.త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌న్ నేప‌థ్యంలో తెర‌కెక్కింది.అయితే ఈ సినిమా రాయ‌ల‌సీమ ప్ర‌జ‌ల‌ను కించ‌ప‌రిచేలా ఉంద‌ని కొంద‌రు రాయ‌ల‌సీమ యువ‌కులు సోష‌ల్ మీడియా వేదిక‌గా కామెంట్స్ చేస్తున్నారు.దీనికి సంబంధించి ఓ టీవీ కార్య‌క్ర‌మంలో చర్చ వేధిక‌లో మాట్లాడానికి వెళ్తూన్న రాయ‌ల‌సీమ యువ‌కులు రోడ్డు ప్ర‌మాదానికి గురైయ్యారు.ఈ ప్ర‌మాదంలో ఓ వ్య‌క్తి అక్క‌డిక్క‌డే మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తుంది.తుంగభద్ర దాటి కొంత ప్రయాణం సాగింది.

హఠాత్తుగా హైవే పై జరిగిన రోడ్డు ప్రమాదంలో వారి వాహనం నుగ్గయింది. ఈ ప్రమాదంలో జలం శ్రీను అనే యువకుడు తుదిశ్వాస విడిచారు.బహుజన ఉద్యమంతో పాటు సీమ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడినవారిలో కృష్ణ నాయక్, (అవుకు మండలం, కర్నూలు జిల్లా, కాగా అనంతపురంలో ప్రస్తుతం ఉంటున్నారు), రవికుమార్ (కర్నూలు), వి.వి నాయుడు (కర్నూలు), రాజశేఖరరెడ్డి (గుత్తి), మొదలైనవారు ఉన్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -