Saturday, April 20, 2024
- Advertisement -

IPL 2021 : క్షమాపణ కోరిన షారూఖ్ ఖాన్.. అందుకేనా?

- Advertisement -

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్ కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో చప్పగా మొదలైంది. ప్రతిసారీ ఎంతో హంగూ ఆర్భాటలతో మొదలయ్యే ఐపీఎల్ సీజన్ సీదా సాదాగా సాగుతుంది. ఏప్రిల్ 13న చిదంబరం స్టేడియం వేదికగా కోల్ కతా 10పరుగుల తేడాతో ఓడిపోయింది. దాదాపు గెలిచేసింది అని అనుకున్న KKR జట్టు చివరికి చేతులు ఎత్తేయడంతో ఆ జట్టు ఓనర్ షారుక్ ఖాన్ ఊహించని విధంగా ట్వీట్ చేశాడు.

నిరుత్సాహపరిచే పెర్ఫామెన్స్.. ఇది చాలా తక్కువ స్థాయి ఆట అంటూ అభిమానులకు క్షమాపణ చెప్పారు షారూఖ్ ఖాన్. 15వ ఓవర్ వరకూ కంట్రోల్ ఉన్న కేకేఆర్ టీం.. ఒక్కసారిగా కుదేలు అయింది.

బౌల్ట్ చివరి ఆరు బంతుల్లో 15పరుగులు మాత్రమే కావాల్సి ఉన్న సమయంలో బౌలింగ్ వేసి రస్సెల్, కమిన్స్ లను అవుట్ చేసి ఆట మొత్తం తారుమారు చేశారు. ఈ నేపథ్యంలోనే తమ టీమ్ సరిగా ఆడలేకపోయిందని.. అభిమానులను నిరుత్సాహ పరిచిందని షారూఖ్ ట్విట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -