Monday, May 13, 2024
- Advertisement -

కింగ్‌ఖాన్‌కు క‌థ రాస్తున్న రాజ‌మౌళి తండ్రి

- Advertisement -

తండ్రికొడుకులు సినీ ప‌రిశ్ర‌మ‌లో విజ‌య బావుటా ఎగుర‌వేస్తున్నారు. క‌థ రాసినా.. సినిమా తీసినా ఇద్ద‌రు సూప‌ర్ డూప‌ర్ హిట్లు అందుకుంటున్నారు. హిట్ కాంబినేష‌న్ ఈ తండ్రికొడుకులుదే. తండ్రి క‌థ రాస్తే కొడుకు సినిమా తీస్తే ఆ సినిమా చ‌రిత్ర తిర‌గ‌రాసేవే ఉన్నాయి. వీరిద్ద‌రితో ప‌నిచేయ‌డానికి సినీన‌టులు ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటారు. ఎంతో మందికి సూప‌ర్‌డూప‌ర్ ఇచ్చిన తండ్రికొడుకులే విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌, రాజ‌మౌళి.

బాలీవుడ్‌లో కింగ్‌ఖాన్‌కు విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ కొత్త క‌థ రాస్తున్నారంట‌. జైత్ర యాత్రను బాలీవుడ్‌లో ఏనాడో విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ప్రారంభించారు. స‌ల్మాన్‌ఖాన్‌కు భ‌జ‌రంగీ భాయిజాన్ సినిమాకు క‌థ అందించి సూప‌ర్‌హిట్ ఇచ్చారు. గ‌తం సంవ‌త్స‌రం త‌మిళంలో విజయ్‌కు మెర్సల్ అనే క‌థ ఇచ్చారు. ఆ సినిమా తెలుగులో ఆడ‌క‌పోయినా త‌మిళంలో సూప‌ర్‌హిట్‌గా నిలిచింది.

బాలీవుడ్ కింగ్ షారుక్‌ఖాన్‌కు విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ చెప్పిన క‌థ లైన్ నచ్చిందంట‌. అది పూర్తి చేసే ప‌నిలో విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా కోసం ముంబై వెళ్లి షారుక్‌ను ప్రత్యేకంగా విజయేంద్ర ప్రసాద్ క‌లిశారు. ఈ సినిమా క‌థ రివెంజ్ డ్రామా నేప‌థ్యంలో ఉండ‌నుందద‌ట‌. ప్రస్తుతం షారూక్ `జీరో` అనే ప్ర‌యోగాత్మ‌క సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత ఈ సినిమా ప్రారంభించే అవ‌కాశం ఉంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -