Friday, April 26, 2024
- Advertisement -

వెబ్​ సీరిస్​ అంటే భయమేస్తోంది..! షాహీద్

- Advertisement -

ప్రస్తుతం వెబ్​సీరిస్​లో ట్రెండ్​ నడుస్తున్న విషయం తెలిసిందే. చాలా మంది నటులు ఇప్పటికే వెబ్​సీరిస్​ వైపు అడుగులు వేస్తున్నారు. అయితే మార్కెట్​ ఎక్కువగా ఉండే పెద్ద హీరోలు మాత్రం వెబ్​సీరిస్​ ల వైపు వెళ్లడం లేదు. సమంత, ప్రియమణి.. హాన్సిక, నయనతార, తమన్నా వెబ్​సీరిస్​లో నటించి తమకంటూ ఓ ఇమేజ్​ను సొంతం చేసుకున్నారు. బాలీవుడ్​ నటుడు షాహిద్​ కపూర్​.. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకేలతో కలిసి ఓ వెబ్ సీరిస్​ను చేయబోతున్నాడు. ఈ విషయంపై ఆయన ఇటీవల ఇన్​స్టాగ్రామ్​లో తన ఫ్యాన్స్​తో ముచ్చటించాడు..

‘వెబ్​సీరిస్​లో నటిస్తుండం చాలా ఆనందంగా ఉంది. కానీ భయంగా కూడా ఉంది. ఎందుకంటే వెబ్​సీరిస్​లో అందరూ రాణించలేరు. ఇక్కడి మార్కెట్​ వేరు. ఇక్కడి ప్రేక్షకుల అభిరుచులు వేరు. నేను ఏ మేరకు సక్సెస్​ అవుతానోనని నాకు భయంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు షాహిద్​ కపూర్​. కరోనా లాక్​డౌన్​ తో చాలా మంది వెబ్ సీరిస్​ల వైపు మొగ్గు చూపుతున్న విషయం తెలిసిందే.

అయితే మార్కెట్​ ఎక్కువగా ఉన్న నటులు మాత్రం ఇప్పుడిప్పుడే వెబ్​సీరిస్​ వైపు వచ్చేందుకు మొగ్గు చూపడం లేదు. అందుకు కారణం.. తాము కేవలం వెబ్​ సీరిస్​కు మాత్రమే పరిమితం అవుతామోనన్న భయం కూడా కావచ్చు. అయితే ఇంకా చాలా మంది ప్రేక్షకులు థియేటర్​లో సినిమాలు చూడడానికే ఇష్టపడుతున్నారు. కాబట్టి.. థియేటర్​లో విడుదలయ్యే సినిమాలకు ఇంకా మార్కెట్​ ఉంది. కానీ కరోనా భయానికి చాలా మంది థియేటర్లకు వచ్చేందుకు ఇష్టపడటం లేదు.

Also Read

ఫ్యామిలీ మ్యాన్​ -3లో క్రేజీ సౌత్​ హీరో..!

సూపర్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టిన యువ హీరో..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -