ప్రస్తుతం వెబ్సీరిస్లో ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. చాలా మంది నటులు ఇప్పటికే వెబ్సీరిస్ వైపు అడుగులు వేస్తున్నారు. అయితే మార్కెట్ ఎక్కువగా ఉండే పెద్ద హీరోలు మాత్రం వెబ్సీరిస్ ల వైపు వెళ్లడం లేదు. సమంత, ప్రియమణి.. హాన్సిక, నయనతార, తమన్నా వెబ్సీరిస్లో నటించి తమకంటూ ఓ ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్.. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకేలతో కలిసి ఓ వెబ్ సీరిస్ను చేయబోతున్నాడు. ఈ విషయంపై ఆయన ఇటీవల ఇన్స్టాగ్రామ్లో తన ఫ్యాన్స్తో ముచ్చటించాడు..
‘వెబ్సీరిస్లో నటిస్తుండం చాలా ఆనందంగా ఉంది. కానీ భయంగా కూడా ఉంది. ఎందుకంటే వెబ్సీరిస్లో అందరూ రాణించలేరు. ఇక్కడి మార్కెట్ వేరు. ఇక్కడి ప్రేక్షకుల అభిరుచులు వేరు. నేను ఏ మేరకు సక్సెస్ అవుతానోనని నాకు భయంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు షాహిద్ కపూర్. కరోనా లాక్డౌన్ తో చాలా మంది వెబ్ సీరిస్ల వైపు మొగ్గు చూపుతున్న విషయం తెలిసిందే.
అయితే మార్కెట్ ఎక్కువగా ఉన్న నటులు మాత్రం ఇప్పుడిప్పుడే వెబ్సీరిస్ వైపు వచ్చేందుకు మొగ్గు చూపడం లేదు. అందుకు కారణం.. తాము కేవలం వెబ్ సీరిస్కు మాత్రమే పరిమితం అవుతామోనన్న భయం కూడా కావచ్చు. అయితే ఇంకా చాలా మంది ప్రేక్షకులు థియేటర్లో సినిమాలు చూడడానికే ఇష్టపడుతున్నారు. కాబట్టి.. థియేటర్లో విడుదలయ్యే సినిమాలకు ఇంకా మార్కెట్ ఉంది. కానీ కరోనా భయానికి చాలా మంది థియేటర్లకు వచ్చేందుకు ఇష్టపడటం లేదు.
Also Read