Sunday, May 12, 2024
- Advertisement -

రైతు పాత్రలో యువ హీరో

- Advertisement -

యువ హీరో శర్వానంద్ ‘పడి పడి లేచే మనసు’ అనే సినిమాతో డిజాస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శర్వానంద్ సుదీర్ వర్మ దర్శకత్వంలో ‘రణరంగం’ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా తర్వాత శర్వానంద్ కొత్త దర్శకుడు కిషోర్ రెడ్డి తో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకి ‘శ్రీకారం’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ప్రస్తుతం ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సినిమాలో శర్వానంద్ ఒక ఫుల్ లెంత్ రైతు పాత్రలో కనిపించబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో రైతులు పడే కష్టాలు మరియు ప్రభుత్వం వారికి ఎలా సహాయ పడాలి, ఇలాంటి వాటిమీద కథ నడుస్తుందని సమాచారం. ఇక ఈ సినిమా కోసం ఇద్దరు హీరోయిన్లు ఎంపిక చేయాల్సి ఉంది. రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -