అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్నైట్ స్టార్ హీరోగా మారాడు విజయ్ దేవరకొండ .చిన్న సినిమాగా వచ్చిన అర్జున్ రెడ్డి పెద్ద హిట్గా నిలిచిన సంగతి అందరికి తెలిసిందే.అర్జున్ రెడ్డి ప్రభావం తెలుగు సినిమాల మీద బాగానే చూపించింది.ఈ సినిమాకుగాను బెస్ట్ ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా గెలుచుకున్నాడు విజయ్ దేవరకొండ.అయితే సినిమాకు తాను చాలా తక్కువ రేమ్యూనిరేషన్ తీసుకున్నానని విజయ్ తెలిపాడు.సినిమాకి తాను అందుకున్న పారితోషికం కేవలం 5 లక్షలు మాత్రమేనని తాజాగా ఓ సందర్భంలో విజయ్ దేవరకొండ చెప్పాడు.
అయితే ఈ సినిమా ఘన విజయాన్ని సాధించిన తరువాత, లాభాలలో వాటా ఇచ్చారని అన్నాడు. ఏదేవైనా ఒక సినిమాను 5 లక్షల పారితోషికానికే విజయ్ దేవరకొండ ఒప్పేసుకోవడం నిజంగా విశేషమేనని చెప్పుకుంటున్నారు. ఈ కంటెంట్ పై నమ్మకంతోనే ఆయన ఓకే చెప్పేసి ఉండొచ్చునని అనుకుంటున్నారు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం గీత గోవిందం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఈ సినిమాతో టాక్సీవాలా సినిమాను కూడా లైన్లో పెట్టాడు.విజయ్ చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉన్నాయి.