- Advertisement -
చిరంజీవి మేనకోడలు హీరోయిన్గా ఏంటీ అనుకుంటున్నారా? అవునండీ చిరంజీవి సినిమాలో మేనకోడలుగా నటించిన శ్రియా శర్మను ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ సినిమాలో హీరోయిన్గా తీసుకున్నారని సమాచారం.తెలుగులో బాల నటిగా శ్రియాకు ‘జై చిరంజీవ’ సినిమా మొదటిది. అందులో చిరంజీవి మేనకోడలు లావణ్యగా శ్రియా నటించింది.
ఆ తరవాత ‘దూకుడు’, ‘రచ్చ’, ‘ఎటో వెళ్లిపోయింది మనసు’, ‘తూనీగ తూనీగ’, ‘నిర్మలా కాన్వెంట్’ చిత్రాల్లోనూ బాల నటిగా కనిపించింది.‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్లో ప్రముఖ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా నటిస్తున్నాడు.సంచలన దర్శకుడు బాల తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే షూటింగ్ చాలా వరకు పూర్తయింది.