Wednesday, May 22, 2024
- Advertisement -

ఆ సినిమాతో అనుష్కకు నష్టం.. చాలా రకాలుగా!

- Advertisement -

చూస్తుంటే సైజ్ జీరో సినిమా అనుష్కను చాలా రకాలుగా నష్టపరిచినట్టుగానే తెలుస్తోంది. ఎన్నో ఆశలతో.. ప్రయోగాత్మక పాత్ర చేయడానికి సిద్ధపడిన ఆమెను ఆ సినిమా తీవ్రంగానే నిరాశ పరిచినట్టుగా సమాచారం.

కొత్త రకం పాత్ర.. సినిమా పెద్ద హిట్ అవుతుంది.. తనకు మంచి పేరును తెచ్చి పెడుతుంది.. అనే లెక్కలతో అనుష్క ‘సైజీ జీరో’ కోసం కష్టపడింది. ఆమె కష్టం ఏమిటో అందరికీ అర్థం అయ్యే ఉంటుంది. ఏకంగా ఇరవై కేజీల బరువు పెరిగి అనుష్క తన అంకిత భావాన్ని చాటుకుంది.

అయితే… అందుకు తగ్గ ఫలితం దక్కలేదు. సైజ్ జీరో సినిమా అట్టర్ ప్లాఫ్ అయ్యింది. తొలి వారమే వసూళ్లు లేకుండా పోయిన ఈ సినిమా ఓవరాల్ గా జీరో గా నిలిచింది. మరి ఈ సినిమా కు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అనుష్క ఈ సినిమాతో మరో రకంగా కూడా నష్టపోయినట్టుగా తెలుస్తోంది.

ఈ సినిమాకు తనూ ఒక నిర్మాతగా వ్యవహరించింది అనుష్కా. తను పారితోషకం తీసుకోకుండా.. తనకు దక్కే డబ్బును ఆమె సినిమాలో పెట్టుబడిగా మదుపు చేసింది. పారితోషకానికి బదులుగా లాభాల్లో వాటాలు తీసుకోవచ్చని భావించింది.

అయితే తీరా సినిమా అట్టర్ ప్లాఫ్ అయ్యింది. లాభాల గురించి చర్చే లేకుండా పోయింది. దీంతో అసలు నిర్మాత పీవీపీకే నష్టాలు మిగిలాయి. ఆయనతో పాటు అనుష్క కూడా నష్టం తప్పలేదు. లాభాలు వచ్చి ఉంటే పీవీపీ వాటా ఇచ్చేవాడేమో!

ఇప్పుడు లాభాల ప్రశ్నే లేదు కాబట్టి.. ఆమెకు న్యాయంగా దక్కాల్సిన పారితోషకం కూడా ఇలా తుడిచి పెట్టుకుపోయింది. ఓవరాల్ గా బరువు పెరిగి శారీరక సమస్యలు కొని తెచ్చుకుని.. రావాల్సిన పారితోషకాన్ని ఇలా పెట్టుబడిగా పెట్టి.. అనుష్క సైజ్ జీరోను చేదు అనుభవంగా మిగుల్చుకున్నట్టుంది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -