- Advertisement -
ప్రముఖ తెలుగు గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తల్లి శకుంతలమ్మ(89) మృతి చెందారు. గత కొద్ది రోజులు నుంచి ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సభ్యులలో ఒకరు తెలిపారు. శకుంతలమ్మ ఈ రోజు(సోమవారం) ఉదయం 7 గంటలకు మరణించారు.
శకుంతలమ్మ మరణవార్తపై పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేశారు. అయితే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రస్తుతం ఇక్కడ లేరని తెలుస్తోంది. ఓ సంగీత కచేరిలో భాగంగా ఆయన లండన్ వెళ్లారని సమాచారం. ఆయన ఇండియాకు తిరిగి రాగనే అంత్యక్రియలు జరగనున్నాయి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్వస్థలం నెల్లూరు కావడంతో ఆమె అంత్యక్రియలు అక్కడే జరగనున్నాయి.