టాలీవుడ్ సంచలన నటి శ్రీరెడ్డి గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతు హల్చల్ చేస్తుంది.గత కొన్ని రోజులుగా సైలెంట్గా ఉన్న శ్రీరెడ్డి మళ్లీ తన ఫేస్బుక్ పోస్ట్లతో రచ్చ చేస్తుంది.టాలీవుడ్లో జరుగుతున్న క్యాస్టింగ్ కౌచ్ గురించి తీవ్ర పోరాటం చేసిన శ్రీరెడ్డి,నటుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్,వాళ్ల అమ్మాగారిపై అనుచిత వాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు పాలైంది.అప్పటి వరకు ఆమెకు సపోర్టు చేసిన వారు ఆమెకు దూరంగా ఉన్నారు.
ఇక నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కొడుకు దగ్గుబాటి అభిరామ్ తనకు అవకాశాలు ఇస్తానని చెప్పి తనను లైంగికంగా వాడుకున్నాడని చెప్పి సంచలనానికి తెరలేపింది.మీడియా సాక్షిగా అతనితో క్లోజ్గా దిగిన కొన్ని ఫోటోలను విడుదల చేసింది.ఇప్పుడు మళ్లీ ఇన్నాళ్లుకు అభిరామ్ ఫోటో తన ఫేస్బుక్లో పెట్టింది శ్రీరెడ్డి.నా లైఫ్లో ఇతనే పెద్ద విలన్ అని అంటు తన ఫేస్బుక్లో పోస్ట్ పెట్టింది.శ్రీరెడ్డిని మీడియా కూడా దూరంగా పెట్టడంతో ఇలా ఫేస్బుక్లో దర్శనం ఇస్తు కాలం గడుపుతుంది.అప్పుడప్పుడు ఫేస్ బుక్ లైవ్ కి వచ్చి అది చేస్తా ఇది చేస్తానంటు చెప్పసాగింది.