టాలీవుడ్ సంచలన నటి శ్రీరెడ్డికి ఎయిడ్స్ అని కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్పై తీవ్ర పోరాటం చేసింది శ్రీరెడ్డి.తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు కోసం పడుకొవలని సంచలన ఆరోపణలు చేసింది శ్రీరెడ్డి. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కొడుకు తనకు అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి తనను లైంగికంగా వాడుకున్నాడని కొన్ని ఛానెల్స్ ఎదుట ఆరోపించింది.దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా రీలిజ్ చేసింది.
క్యాస్టింగ్ కౌచ్ పోరాటం తీవ్రంగా ఉన్న దశలో నటుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్, వాళ్ల అమ్మగారిపై అనుచిత వాఖ్యలు చేయడంతో అప్పటి వరకు శ్రీరెడ్డికి సపోర్టు చేసిన వారందరూ ఆమెకు దూరంగా ఉన్నారు.ఈ సంఘటన తరువాత మీడియా కూడా శ్రీరెడ్డిని లైట్గా తీసుకున్నాయి. శ్రీరెడ్డి కూడా కొన్నాళ్లు సైలెంట్గా ఉంది.రెండు రోజుల క్రితం మళ్లీ వెలుగులోకి వచ్చిన శ్రీరెడ్డి జీవితరాజశేఖర్తో పాటు మరో 28 మందిపై కేసు పెట్టి మళ్లీ వార్తల్లో నిలిచింది.
ఇటువంటి సందర్బంలోనే ఆమెపై మళ్లీ సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.శ్రీరెడ్డి ఎయిడ్స్తో చినిపోయింది అంటు కొందరు శ్రీరెడ్డి ఫోటోలను యూట్యూబ్లో అప్లోడ్ చేశారు.మరి కొందరు శ్రీరెడ్డి ఆత్మహత్య చేసుకుందని మరికొందరు పోస్టింగ్లు చేస్తున్నారు.దీనిపై శ్రీరెడ్డి మండిపడింది.తనపై కక్ష సాధించేందుకు కావాలనే కొంత మంది ఇలా చేస్తున్నారని శ్రీరెడ్డి ఆరోపించింది.
ఒక్కొక్కడి తాట వలుస్తా జాగ్రత్త. సైబర్ క్రైమ్లో కేసులు ఫైల్ చేశా,ఇకపై పెద్ద తలకాయల పని చెప్తా..’ అంటూ శ్రీరెడ్డి తన ఫేస్బుక్ అకౌంట్లో రాసుకొచ్చింది.మరి శ్రీరెడ్డిపై ఇలాంటి అనుచిత వాఖ్యలపై ఎవరు ఉన్నారనే ప్రశ్న అందరిలోను మొదలైంది.కొందరు పవన్ ఫ్యాన్సే ఇలా చేశారని,కాదు జీవితరాజశేఖర్ వాళ్లు ఇలా చేసి ఉంటారని కొందరు భావిస్తున్నారు.ఫైనల్గా ఈ తప్పు చేసింది ఎవరో తెలియాలి అంటే కొన్నాళ్లు ఆగాల్సిందే!
https://www.youtube.com/watch?v=J61sWQH05Qs