టాలీవుడ్ తాజ సంచలన తార శ్రీరెడ్డి మా సభ్యత్వనికి రుసుం చెల్లించారు.ఈ రోజు(గురువారం) ఉదయం ఫిలింఛాంబర్ దగ్గరకు వచ్చి మా సభ్యత్వనికి ఆప్లికేషన్ పెట్టకుని దానికి రుసుం చెల్లించానని శ్రీరెడ్డి మీడియాకు వెల్లడించారు. తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి తీవ్ర పోరాటం చేసిన శ్రీరెడ్డి..తనను దగ్గుబాటి సరేష్ బాబు తనయుడు అభిరాం తనకు అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి తనను లైంగికంగా వాడుకుని వదిలేశాడని నాలా చాలా మంది జీవితాలు నాశనం అవుతున్నాయని … కొన్ని రోజులు మీడియా చుట్టు తిరిగింది.ఫిలింఛాంబర్ దగ్గర అర్థ నగ్న ప్రదర్శన కూడా చేసింది.
దీంతో ఈ గొడవ తారా స్థాయికి చేరింది.దీంతో మా అసోసియేషన్ శ్రీరెడ్డికి మా సభ్యత్వం ఇవ్వడం జరగదు అని తెలిపింది. కాని శ్రీరెడ్డిని మోసం చేసిన వారిలో ఇండస్ట్రీ పెద్దలకు సంబంధించిన కూడా ఉండటంతో …శ్రీరెడ్డి విషయంలో వెనక్కి తగ్గింది మా అసోసియేషన్.శ్రీరెడ్డికి మా అసోసియేషన్ సభ్యత్వం ఇవ్వడానికి అంగీకారం తెలిపింది.అందులో భాగంగానే ఈ రోజు శ్రీరెడ్డి మా సభ్యత్వ రుసుం చెల్లించాడానికి ఫిలిం ఛాంబర్కు వచ్చింది.మా పాలకవర్గం సభ్యత్వం ఇచ్చినా, ఇవ్వకపోయినా సినీ పరిశ్రమలోని సమస్యలపై పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని శ్రీరెడ్డి కోరారు.