టాలీవుడ్ వివాస్పద నటి శ్రీరెడ్డి మరోసారి తన మాటలతో వార్తల్లో నిలిచింది. టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్పై తీవ్ర పోరాటం చేసిన శ్రీరెడ్డి,తరువాత సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరిపై వ్యక్తిగత ఆరోపణలు చేసి విమర్శల పాలైంది. తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు కోస పడుకావాలని .ఇక్కడ పడుకుంటేనే అవకాశాలు వస్తాయని తెలిపి సంచలనానికి తెర లేపింది. నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కొడుకు అభిరామ్ తనకు అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి తనను లైంగికంగా వాడుకున్నాడని చెప్పి సంచలనం రేపింది.ఇక నటుడు,జనసేన అధినేత పవన్ కల్యాణ్,వాళ్ల అమ్మాగారిని అనకూడని మాటలు అనడంతో ,అప్పటి వరకు ఆమెకు మద్దతు ఇచ్చిన వారందరు ఆమెకు దూరంగా జరిగారు.
తాజాగా మళ్లీ ఆమె పవన్ కల్యాణ్పై అనుచిత వాఖ్యలు చేసింది.పవన్ కల్యాణ్పై తన ఫేస్బుక్ లైవ్లో మాట్లాడింది. ఈ రోజు హాట్ టాపిక్ పీకే అంటు మొదలు పెట్టిన శ్రీరెడ్డి పవన్ను ఓ రేంజ్లో ఎసుకుంది.నేను ఓ సమస్యపై పోరాడుతున్న నన్ను ఇంతలా హింసించడం కరెక్టేనా అని పవన్ను ప్రశ్నించింది.ఆడవాళ్లు సమస్యలను మీరు పట్టించుకోరని పవన్ ఉద్దేశించి మాట్లాడింది.పవన్కు ఇంగిత జ్ఞానం కూడా లేదు. ఓ పొలిటికల్ మీటింగ్ నా గురించి మాట్లాడటం ఎంత వరకు కరెక్ట్ అని నువ్వే చెప్పాలి అని పవన్ని అడిగింది శ్రీరెడ్డి.ఎవరు ఎవరితో పడుకుంటే నేను వెళ్లి చూడాలా? అని పవన్ ప్రశ్నించడాన్ని తప్పు పట్టింది శ్రీరెడ్డి.నువ్వు రాజకీయ నాయకుడిగా అనర్హుడివి అని పవన్ ఉద్దేశించి మాట్లాడింది .మీ ఫ్యామిలీతో పెట్టుకుంటే ఎవరినైనా మీరు తొక్కేస్తారని ,అది జరిగింది అని కూడా అందరికి తెలుసునంటూ ఫేస్బుక్ లైవ్లో చెప్పుకొచ్చింది శ్రీరెడ్డి.
ఓ పిచ్చి పీకే ,ఓ వెర్రీ పీకే అంటూ పవన్ను నానా మాటలు అంది శ్రీరెడ్డి.దీంతో పవన్ ఫ్యాన్స్ ఆమె రెచ్చిపోయారు.లైవ్లోనే శ్రీరెడ్డిని బండ బుతులు తిట్టడం మొదలుపెట్టారు.ఈ విషయంలో శ్రీరెడ్డి కూడా ఎక్కడ తగ్గలేదు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ను పీకే పిచ్చ సేన అంటూ సంబోదించింది.రండి రా రండీ మీ లాంటి వాళ్ల కోసమే నా లాంటిది పుట్టింది అని పవన్ ఫ్యాన్స్ను కడిగి పారేసింది శ్రీరెడ్డి.