అతిలోక సుందరి శ్రీదేవి చనిపోయి చాలా రోజులు కావస్తున్న నిత్యం ఆమె వార్తల్లో నిలుస్తునే ఉంది. శ్రీదేవి బాలీవుడ్లో హీరోయిన్గా ఎదగాడానికి చాలానే కష్టపడింది.తన పడ్డ కష్టం కుతుళ్లు పడకుడదు అని తన కుతుళ్లకు అండగా నిలిచింది.శ్రీదేవి పెద్దకుమార్తె జాహ్నవి విషయంలో శ్రీదేవి చాలా జాగ్రత్తగా ఉండేది.ఆమెను హీరోయిన్గా చేయడానికి చాలానే ఆలోచన చేసింది.జాహ్నవి కోసం సూపర్ హిట్ మూవీని సెలెక్ట్ చేసి రీమేక్ చేస్తుంది.ఆ సినిమానే ధడక్.సినిమా షూటింగ్ జోరుగా సాగుతున్న టైంలో అనూహ్యంగా శ్రీదేవి మరణించింది.
జాహ్నవి ఆ బాధను దిగమింగుకుని కొద్దిరోజుల్లోనే ధడక్ సెట్లోకి వచ్చేసింది. హీరోయిన్ గా కెరీర్ కొనసాగాలంటే ఫిట్ నెస్ ఎంత ముఖ్యమో జాహ్నవికి ప్రత్యేకంగా తెలియంది కాదు. అందుకే అప్పుడే జిమ్ కు కూడా వెళ్లడం మొదలెట్టింది. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఈ మూవీకి నిర్మాత. బాలీవుడ్ షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖట్టర్ ఇందులో హీరోగా చేస్తున్నాడు.