Tuesday, May 14, 2024
- Advertisement -

శ్రీమంతుడు ప్రొడ్యూసర్స్ ఏపి క్యాప్టెల్‌కు డొనేషన్ ఎంతో తెలుసా..?

- Advertisement -

శ్రీమంతుడు సినిమాను నిర్మించి సూపర్‌ హిట్ సాధించిన ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి మరో అడుగు ముందుకు వేశారు. తమ సినిమాలో ఏదైతే ప్రేక్షకులకు బోధించారో, అదే విదంగా నిజ జీవితంలో కూడా చేసేందుకు ముందుకు వచ్చారు.

ఆంద్ర ప్రదేశ్‌ కొత్త రాజధాని అమరావతి నిర్మాణానికి ఏకంగా 10లక్షల రూపాయల డొనేషన్ ప్రకటించారు. ఈ మొత్తాన్ని ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వానికి అందజేశారు. శ్రీమంతుడు సినిమాలో కూడా మిలినియర్ అయిన హర్ష(మహేశ్ బాబు) తన సొంత ఊరికోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి గ్రామాన్ని అభివృద్ది పథంలోకి నడిపిస్తాడు. ఈ కథను డైరెక్టర్ కొరటాల శివ ఫ్యామిలి డ్రామాగా అద్బుతంగా తెరకెక్కించడంతో అందరి మన్ననలు పొందుతోంది.

కథను సినిమాగా నిర్మించి ప్రేక్షకులకు ఒక మెసేజ్ రూపంలో చూపించడంలో నిర్మాత, డైరెక్టర్ ఇద్దరూ సక్సెస్ అయ్యారు. సినిమాగా చూపించడమే కాకుండా ఇప్పుడు మళ్ళీ, ఇలా తమ వంతు సాయం ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధానికి చేయడంతో సినిమా ప్రొడ్యూసర్స్ బయట కూడా అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ సినిమాను ఏపి సిఎం చంద్రబాబు వచ్చే ఆదివారం చూడబోతున్నారు. అలానే తెలంగాణ సిఎం కేసిఆర్ కూడా ఎప్పుడైనా చూడొచ్చనే వార్తలు వస్తున్నాయి.   

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -