కేజీఎఫ్
ఫేమ్ ప్రశాంత్ నీల్ కి మంచి డిమాండ్ పెరిగింది. పాన్ ఇండియా మూవీ మేకర్ గా ప్రశాంత్ నీల్ పై స్టార్ హీరోలు కన్ను వేశారు. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ‘సలార్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఇక దాదాపు మూడేళ్ల విరామం తర్వాత కమల్ కూతురు శృతి హాసన్ ‘క్రాక్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చంది. మంచి ఫిట్ నెస్ తో, అద్భుతమైన నటనతో ఆకట్టుకుది శృతి హాసన్.
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రం ఈ సంక్రాంతికి విడుదలై అనూహ్య విజయాన్ని సాధించడమే కాకుండా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి శృతి కెరీర్కి మరింత బూస్టప్ ఇచ్చింది. దాంతో ఈ అమ్మడు వరుస సినిమాలతో బిజీగా మారింది. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘సలార్’ మూవీలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుంది.
మైనింగ్ మాఫియా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ప్రభాస్ పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ మూవీలో శృతి హాసన్ టీవీ జర్నలిస్టుగా కనిపించనుందని ఫిలిమ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. భారీ అంచనాల మధ్య హైవోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ బ్యానర్పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
నేటి పంచాంగం,మంగళవారం(20-4-2021)