ఎన్టీఆర్-రామ్ చరణ్లతో రాజమౌళి తెరకెక్కించనున్న టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఫిల్మ్ వర్క్స్ శరవేగంగా సాగుతున్నాయి. ఎన్టీఆర్-చరణ్ల మధ్య వచ్చే హై ఎండ్ ఎమోషనల్ సీన్స్ని చెక్కుతున్నాడు జక్కన్న. ముందుగా ఈ సీన్స్కి స్టోరీ బోర్డ్ వేయిస్తాడట రాజమౌళి. ఆ తర్వాత ఈ సీన్స్ని డమ్మీ క్యారెక్టర్స్తో షూట్ చేయనున్నాడు రాజమౌళి.
ఈ ప్రాసెస్ అంతా కూడా తాను ఎదుర్కోబోయే బిగ్గెస్ట్ హర్డిల్ని ఎదుర్కునే ప్రయత్నం కోసం చేస్తున్నాడు జక్కన్న. సినిమాకు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్లో ఫస్ట్ తన పేరు రాజమౌళి ఆర్ వచ్చేలా చేసుకున్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్-రామ్ చరణ్ పేర్లు రెండూ ఒకేసారి వచ్చేలా చేశాడు. రేపు ఫిల్మ్ మేకింగ్ టైంలో కూడా జక్కన్న ఎదుర్కోబోయే బిగ్గెస్ట్ ట్రబుల్ ఇదే. మా హీరో పేరు ముందంటే మా హీరో పేరు ముందు అనే స్థాయిలో గొడవపడే ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే ఏ హీరో ఎన్ని సీన్స్లో కనిపించాడు? ఏ హీరో ఎంత బాగా యాక్ట్ చేశాడు? ఏ హీరో నటకు ఎంత పేరొచ్చింది? ఏ హీరోకి ఎన్ని సాంగ్స్ ఉన్నాయి? ఇలా అన్ని విషయాల్లోనూ అభిమానులు కంపేరిజన్స్ తీస్తారు. అందుకే ఇప్పటి నుంచే ఏ ఒక్క హీరోని తక్కువ చేయకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. బాహుబలిలో రానా, ప్రభాస్ల స్థాయి ఒకటే కాకపోవడం….పైగా రానా విలన్ అవ్వడంతో జక్కన్న బ్రతికిపోయాడు. కానీ ఈ సారి మాత్రం ఇద్దరూ ఫ్యాన్స్ హంగామా భారీగా ఉండే స్టార్ హీరోస్. అందుకే ఇద్దరి హీరోల ఫ్యాన్స్ని పూర్తిగా సంతృప్తి పరిచేలా…….ఏ ఒక్క హీరో ఫ్యాన్స్ కూడా హర్ట్ అవ్వకుండా ఉండేలా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాడు రాజమౌళి. రాజమౌళి కనుక చరణ్, ఎన్టీఆర్ల అభిమానులను శాటిస్ఫై చేయడంలో సక్సెస్ అయితే మాత్రం ఈ సినిమా బాహుబలిని మించి సక్సెస్ అవుతుందనడంలో సందేహం లేదు.