Monday, May 13, 2024
- Advertisement -

ఎమోషన్ గ్రాఫిక్స్ ను డామినేట్ చేసే కంటెంటా..?

- Advertisement -

ఈగ,బాహుబలి లాంటి చిత్రాలతో గ్రాఫిక్స్ ను తెగ వాడేసుకుని గ్రాఫికల్ చిత్రాలను తీసిన రాజమౌళికి ఇపుడు తాను తీయబోయె తర్వాతి చిత్రం కత్తిమీద సాము లాగ కనిపిస్తుంది.చరణ్ ,తారక్ లతో సినిమా అని కన్ఫామ్ అయిపోయాక…ఇక చేయబోయె సినిమా ఏ స్థాయిలో ఉంటుందా అని అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు.దీనికి తోడు అసలు ఈ చిత్రంలో గ్రాఫిక్స్ మాయా జాలం ఏమీ ఉండదని తెలిసాక అభిమానులు గోల పెట్టేస్తున్నారు. బాహుబలి సిరీస్ తో అంతర్జాతీయ చిత్రాలు తీసిన రాజమౌళి చేస్తే బాలీవుడ్ సినిమా చేయాలి లేదంటే.. ఓ బిటౌన్ హీరోతో అన్ని భాషల్లో ఓ ఫిలిం చేయాలి .అది వదిలేసి టాలీవుడ్ హీరోలతో ఎమోషనల్ చిత్రం చేయడం ఎంత వరకు కరెక్ట్ అని క్రిటిక్స్ సందేహిస్తున్నారు.

ఇదే ఆలోచన జక్కన్నకు కూడా వచ్చి ఉంటుంది. ఇక్కడ రాజమౌళి థాట్స్ ను మనం తక్కువ అంచనా వేయలేం.బాహుబలి సెకండ్ పార్ట్ విషయంలో కూడా ఇలాగే లెక్కలు వేసిన క్రిటిక్స్ చిత్రం రిలీజయ్యాక ముక్కునే వేలేసుకున్నారు.దాంతో మ్యాటర్ మరోలా మారిపోయింది. అదే విధంగా చరణ్ ,తారక్ సినిమా విషయంలోను జక్కన్న లెక్కలు జక్కన్నకు ఉన్నాయి. ఈ మల్టి స్టారర్ కథలో ఎక్కువగా ఎమోషన్స్ ని చూపించే విధంగా తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో కూర్చొని కథపై కసరత్తులు చేస్తున్నాడు.

ఇప్పటికే సినిమా కాన్సెప్ట్ ని హీరోలిద్దరికి చెప్పి సినిమాలో ఎమోషన్స్ ప్రదానం కానున్నాయని గ్రాఫిక్స్ ఉండవని వివరించడం జరిగాయని తెలుస్తుంది. కథకు తగ్గట్టుగా ఫిట్నెస్ పై హీరోలిద్దరిని జాగ్రత్తలు తీసుకోవాలని జక్కన్న వారికి ఓ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే సినిమాలో రాజమౌళి రెగ్యులర్ యాక్షన్ సీన్స్ మాత్రం ఎప్పటిలానే ఉంటాయట. ఇక కథ మొత్తం పూర్తి చేశాక మళ్లీ ఒకసారి ఇద్దరి హీరోలకు రాజమౌళి సినిమా కథను వినిపించబోతున్నాడట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -