Friday, May 3, 2024
- Advertisement -

రాజమౌళి కుమారుడి పెళ్లి ఎవరితోనో తెలుసా ?

- Advertisement -

ప్రముఖ టాలీవుడ్ టాప్ డైరక్టర్ రాజమౌళి ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన కుమారుడు కార్తికేయ వివాహం త్వరలో జరగనుంది. ప్రముఖ నిర్మాత దివంగత వి బి రాజేంద్రప్రసాద్ మనువరాలు పూజా ప్రసాద్ తో కార్తికేయ ఎంగేజ్ మెంట్ బుధవారం రాజమౌలి నివాసంలో ఘనంగా జరిగింది. కుటుంబసభ్యులు, స్నేహితుల మధ్య వీరి నిశ్చితార్ధం పూర్తి చేశారు. కార్తికేయ స్నేహితుడు అక్కినేని అఖిల్ ట్విట్టర్ ద్వారా విడుదల చేసిన ఫొటోలతో పాటు ఇప్పుడీ వార్త వైరల్ అయింది. కార్తికేయ తండ్రి వద్ద దర్శకత్వ మెలకువులు నేర్చుకుంటూ, ఆ శాఖలో నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. మరో వైపు చిత్రనిర్మాణ రంగంవైపు అడుగులేయాలనే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇక పూజాప్రసాద్ ప్రముఖ నిర్మాత జగపతి పిక్చర్స్ అధినేత, దివంగత వి బి రాజేంద్రప్రసాద్ పెద్ద కుమారుడు వీరమాచినేని రామ్ ప్రసాద్ కుమార్తె. ఈమె కర్నాటక సంగీతంలో నిష్ణాతురాలు. గాయని. అనేక దైవభక్తి గీతాలు ఆలపించి, ఆల్బమ్స్ విడుదల చేసి మంచి పేరు తెచ్చుకుంది. హీరో, విలన్, క్యారెక్టర్ నటుడు జగపతి బాబు పూజాప్రసాద్ కు బాబాయ్.

కొన్నాళ్లుగా కార్తికేయ పూజాప్రసాద్ ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరి ప్రేమకు ఇరువర్గాల పెద్దలు అంగీకారం తెలపడంతో కొద్దిమంది సన్నిహితుల మధ్య రాజమౌళి ఇంటిలో నిశ్చితార్ధం జరిపారు. వచ్చే డిసెంబర్ లో వీరి వివాహం గ్రాండ్ గా జరపడానికి రౌజమౌళి దంపతులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పూజా ప్రసాద్ తండ్రి రాంప్రసాద్ సినీమా రంగంలో లేరు. ఇతర వ్యాపారాల్లో ఆయన స్థిరపడ్డారు. కానీ తండ్రి నిర్మాతగా ఉన్న కాలం నాటి నుంచీ, ఆ రంగంలోని వారితో సత్సంబంధాలు ఉన్నాయి. ఇక తమ్ముడు జగపతిబాబు హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా తనని తాను నిరూపించుకున్న సంగతి తెలిసిందే. కార్తికేయ, పూజాప్రసాద్ ఎంగేజ్ మెంట్ న్యూస్ అక్కినేని అఖిల్ ద్వారా బయటకు వచ్చింది. అఖిల్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని షేర్ చేసుకున్నాడు. పూజా నాకు రాఖీ చెల్లెలు. అని చెబుతూ ఆమెతో కార్తికేయ ఎంగేజ్ మెంట్ జరిగిన విషయాన్ని షేర్ చేసుకున్నాడు. ఇప్పుడీ న్యూస్ వైరల్ గా మారింది. ఈ జంటకు అందరూ అభినందనలు తెలపుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -