Sunday, April 28, 2024
- Advertisement -

జై లవకుశ చూసి రాజమౌళి ఏమన్నారు..?

- Advertisement -

ఎన్టీఆర్ మూడు విభన్న పాత్రల్లో నటించిన సినిమా జై లవకుశ. బాబీ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాని హీరో కళ్యాణ్ రామ్ నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. రాశి ఖన్నా, నివేథా హీరోయిన్స్ గా నటించారు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి.

ఇక జైలవకుశ రికార్డులు సృష్టించి ఖాయమని అభిమానులు అంతున్నారు. ఇంకోవైపు.. సినీ ప్రముఖులు.. ఈ సినిమాని చూసి.. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే పరిశ్రమలో.. ఎన్టీఆర్ కు రాజమౌళి మధ్య ఎలాంటి ఫ్రెండ్‍షిప్ ఉందో అందరికి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ కు సంబంధించి ఏ సినిమా రిలీజ్ అయినా.. ఆ సినిమాపై రాజమౌళి తన అభిప్రాయం చెప్తారు. ఇక ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అవుతుంటే.. రాజమౌళి ఖచ్చితంగా ఆ సినిమాని ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే. ఎన్టీఆర్ అంటే ఆ రేంజ్ అభిమానం రాజమౌళికి.

ఇక తాజాగా రిలీజ్ అయిన ‘జై లవ కుశ’ సినిమాను చూసిన రాజమౌళి వెంటనే ట్విట్టర్‌లో స్పందించారు. ఒకే ఒక్క వాఖ్యంతో సినిమా, ఎన్టీఆర్ గొప్పతనాన్ని పొగిడేశారు. రాజమౌళి ట్విట్టర్ లో ఏమని స్పందించారంటే.. ‘తారక్‌.. గర్వంతో నా హృదయం ఉప్పొంగుతోంది. పదాలు సరిపోవు. జై ‘జై’..’ అని రాజమౌళి ట్వీట్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -