Monday, May 6, 2024
- Advertisement -

కొత్త ప్రేమ‌క‌థ‌తో సుధీర్‌బాబు

- Advertisement -

నిమా షూటింగ్ ప్రారంభం

వ‌రుస సినిమాలు చేస్తూ థియేట‌ర్ల‌లో సుధీర్‌బాబు క‌నిపిస్తున్నాడు. కాని విజ‌యాలు అంతంతే. చివ‌ర‌గా ‘శ‌మంత‌క‌మ‌ణి’ అని ఆది, నారా రోహిత్‌తో క‌లిసి వ‌చ్చాడు. కానీ ఆ సినిమా ఆడ‌లేదు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఓ సినిమా ప్రారంభించాడు. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై నిర్మిస్తున్న సినిమాలో పాల్గొంటున్నాడు. అదితీరావు హైదరీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం చేస్తున్నారు. శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మాత.

ఈ సినిమా షూటింగ్ సోమవారం (డిసెంబ‌ర్ 11వ తేదీ) ప్రారంభ‌మైంది. తొలి సన్నివేశానికి నటుడు తనికెళ్ల భరణి క్లాప్‌నిచ్చారు. అవసరాల శ్రీనివాస్‌ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘కొత్త తరహా ప్రేమ కథా చిత్రమిది. ఆద్యంతం ఉత్కంఠగా సాగుతూనే వినోదాన్ని పంచే కథతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నట్లు చిత్ర బృందం ప్ర‌క‌టించింది. ఫిబ్రవరి 8 వరకు హైదరాబాద్‌లో షూటింగ్ చేస్తారు. తర్వాత హిమాచల్‌ప్రదేశ్‌, ముంబాయిలో షూటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. మేలో సినిమా విడుదల చేస్తామని ప్ర‌క‌టించారు. నరేశ్‌, నందు, తనికెళ్ల భరణి, హరితేజ, పవిత్ర లోకేశ్‌, కాదంబరి కిరణ్‌ తదితరులు ఈ సినిమాలో న‌టించ‌నున్నారు. వివేక్‌సాగర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -