ప్రిన్స్ కుటుంబం నుంచి వచ్చిన నటుడు సుధీర్ బాబు సంవత్సరానికి ఒకటి, రెండు సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. కానీ విజయాలు అంతగా రాలేదు. ప్రేమకథా చిత్రమ్ సినిమా మాత్రం బాగానే ఆడింది. ఇటీవల శమంతకమణి అనే సినిమాలతో ఒక హీరోగా నటించాడు. కానీ ఆడలేదు. ఆ తర్వాత మరో సినిమా చేస్తున్నాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఇటీవల ఓ సినిమా ప్రారంభించారు. అందులో హీరోగా సుధీర్బాబు నటిస్తున్నాడు. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాత. అయితే ఈ సినిమాకు సమ్మోహనం అనే పేరును ఖరారు చేశారు.
సుధీర్బాబు సరసన అదితీ రావ్ హైద్రి ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. అనూహ్యమైన కథాంశంతో ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ చెబుతున్నారు. వివేక్ సాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. సుధీర్బాబు నటించిన వీరభోగ వసంతరాయలు అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.