Friday, April 26, 2024
- Advertisement -

ఆనాడు ఎత్తుకున్న చిన్నారితో.. ఇప్పుడు రొమాన్సా

- Advertisement -

బడిపంతులు సినిమా గుర్తుంది కదా. అందుల్లో ఎన్టీఆర్ ,అంజలిదేవిలు భార్యభర్తలుగా యాక్ట్ చేశారు. వారికి మనువరాలిగా శ్రీదేవి యాక్ట్ చేసింది. కట్ చేస్తే కొన్నేళ్ల తర్వాత అదే శ్రీదేవి ఎన్టీఆర్ తో అది ఒకటో నంబర్ బస్ అంటూ ఎగిరెగిరి పాడింది. ఆ రోజుల్లో ప్రేక్షకులు ఈవిషయాన్ని పెద్దగా చెపుకున్నారు. తర్వాత కాలంలో ఆతరమా సంఘటనలు అతి రేర్ గా జరిగిఉండొచ్చు.మళ్లీ ఇంతకాలనికి అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. అయితే ఆ ఇన్సిడెంట్ చాలా చిన్నదనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడున్నది ఓ చిన్న కామెడీ హీరో.

అతడెవరో కాదు టూ కంట్రీస్ తో మనముందుకు వస్తోన్న సునీల్ . ఈ నెల 29వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ లో ఓ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాడు. ఈ సినిమా కోసం లొకేషన్లు చూడటానికి దర్శకుడు .. సినిమాటో గ్రాఫర్ యూఎస్ ఏ వెళ్లారట. అక్కడ హీరోయిన్ మనీషా రాజ్ ఇంట్లో అతిథులుగా దిగారు. ఈ సినిమాలో కథానాయికకి ఉండవలసిన అన్ని లక్షణాలు ఆమెకి ఉండటంతో, ఆమె పేరెంట్స్ తో మాట్లాడి ఒప్పించారట. మళ్లీ కట్ చేస్తే మొదటి రోజు షూటింగ్ పూర్తయిన తరువాత “చాలా కాలం క్రితం మీరు ఓ పాపను ఎత్తుకున్నారు .. అప్పుడు మీతో మేం ఫోటో దిగాము” అని ఆ హీరోయిన్ తండ్రి అనడంతో ఆశ్చర్యపోయాడట. అది ‘సొంతం’ సినిమా కోసం ఫారిన్ వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన. అప్పుడు ఓ యంగ్ కపుల్ తమ పాపను తీసుకొచ్చి సునీల్ తో ఫోటో దిగారట. ఆ అమ్మాయే ఇప్పుడు టూ కంట్రీస్ సినిమాలో హీరోయిన్ అని తెలుసుకుని సునీల్ షాక్ అయ్యాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -