- మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు బొమ్మ
శృంగార తార సన్నీలియోన్కు అరుదైన గౌరవం దక్కింది. తన అందచందాలతో పురుషుల కలల సుందరిగా ఉన్న ఈ భామ అరుదైన ఘనత పొందింది. ప్రజాదరణ, ప్రేక్షకుల మెప్పు, ప్రముఖులుగా ఉంటే వారి బొమ్మలను మేడం టుస్సాడ్ మ్యూజియంలో ఉంచుతారు. అచ్చుగుద్దినట్టు ఉండేలా మైనపు బొమ్మను కొలువు ఉంచుతారు. లండన్లో ఉన్న ఈ మ్యూజియాన్ని కోట్లమంది సందర్శిస్తుంటారు. ఈ మ్యూజియంలో ఎవరిదైనా విగ్రహం ఉండాలి అంటే వాళ్లు తమ వృత్తిలో గొప్పగా ఏదైనా సాధించినవాళ్లు లేకపోతే, అశేషమైన ప్రజల మెప్పు పొందినవాళ్లు, ఎవరికీ సాధ్యం కాని ఘనతను సాధించినవాళ్లు అయితే ఈ మ్యూజియంలో ఉంచుతారు. ఆ విధంగా ఇప్పుడు సన్నీలియోన్ ప్రతిమ అందులో కొలువుదీరనుంది.
బాలీవుడ్ శృంగార దేవతగా సన్నీలియోన్ విగ్రహం అందులో ఉండనుంది. ఢిల్లీలో ఏర్పాటు చేయబోయే మేడం టుస్సాడ్ మ్యుజియంలో సన్నీలియోన్ మైనపు ప్రతిమను పెట్టనున్నారు. కొందరు నిపుణులు లండన్ నుంచి వచ్చి సన్నీలియోన్ శరీర కొలతలు, ఫొటోలు 200 దాకా తీసుకున్నారు. ఈ మైనపు బొమ్మలు అచ్చం మనిషిలా ఉంటాయి. ఆ విగ్రహం పక్కన నిలబడింది మనిషా, బొమ్మనా అని గుర్తుపట్టలేనంత ఉంటాయి.
ఇప్పటిదాకా ఢిల్లీ టుస్సాడ్లో ఉండబోయే వాటిలో కరీనా కపూర్, కత్రినా కైఫ్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, మాధురి దీక్షిత్, సల్మాన్ ఖాన్, రణ్వీర్ కపూర్, ఏపీజే అబ్దుల్ కలాం, ఆశా భోంస్లేలతో పలువురు విదేశీ ప్రముఖుల విగ్రహాలు ఉండనున్నాయి.