Saturday, April 20, 2024
- Advertisement -

సర్ ప్రైజ్: మరో కొత్త వ్యాపారంలోకి మహేష్ బాబు

- Advertisement -

లాక్ డౌన్ వేళ స్టార్ హీరో మహేష్ బాబు ఇంట్లోనే తన కుటుంబ సభ్యులతో కాలం గడుపుతున్నాడు. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత ఇద్దరు సీనియర్ దర్శకుల కథలు నచ్చక వారితో సినిమాలను వదులుకున్నారు. ఇప్పుడు కొత్త సినిమా దర్శకుడు పరుశురామ్ తో అనుకున్నా.. ‘కరోనా’ లాక్ డౌన్ తో ఆగిపోయింది.

భవిష్యత్తులోనూ కరోనా తగ్గినా మునుపటిలా సినిమా పరిశ్రమ నిలదొక్కుకుంటుందన్న గ్యారెంటీ కనిపించడం లేదు. కరోనా భయంతో జనాలు సినిమా థియేటర్స్ కు వస్తారన్నది అనుమానంగా మారింది.

ఈ నేపథ్యంలో మహేష్ బాబు కూడా కొత్త బిజినెస్ ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. తన సొంతంగా ‘ఓటీటీ’ ఫ్టాట్ ఫామ్ బిజినెస్ లోకి రాబోతున్నట్టు సమాచారం.

ఇప్పటికే తెలుగులో అల్లు అరవింద్ ‘ఆహా’ అనే ఓటీటీ ఫ్టాట్ ఫామ్ ను లాంచ్ చేశారు. మెగా హీరోల సినిమాలను అందులో వేస్తున్నారు. తెలుగు సినిమాల కోసం ప్రత్యేకంగా ఈ ‘ఆహా’ను సృష్టించాడు.

ఇప్పుడు వారిని అనుసరిస్తూ మహేష్ బాబు కూడా సొంత ‘ఓటీటీ’ ఫ్టాట్ ఫామ్ తీసుకొస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు బాలీవుడ్ దిగ్గజ ప్రొడక్షన్ హౌస్ మద్దతుగా ముందుకు వచ్చిందని వార్తలు వస్తున్నాయి. నమ్రత ఈ పనులు చక్కబెడుతున్నట్టు సమాచారం.

అయితే కరోనాతో మొత్తం సినీ పరిశ్రమ తిరోగమనంలో ఉన్న ఈ సమయంలో డబ్బు పెట్టుబడి పెట్టడం చాలా ప్రమాదమని.. అందుకే మహేష్ ఏ వ్యాపారంలోకి దిగకపోవచ్చని అంటున్నారు.

ప్రస్తుతం మహేష్ బాబు కొత్త సినిమా పనుల్లో ఉంటున్నారు. కొత్త స్క్రిప్ట్ లు వింటున్నట్టు తెలిసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -