Friday, April 19, 2024
- Advertisement -

సూర్య ‘జై భీమ్’ కూడా ఓటీటీ లోనే.. నిజమేంతా..!

- Advertisement -

తమిళ స్టార్ హీరో సూర్య కరోనా పరిస్థితుల్లోనూ సినిమాలు వేగంగా పూర్తి చేసుకున్నాడు. గత ఏడాది కరోనా సమయంలో సూర్య హీరోగా నటించిన ఆకాశమే నీ హద్దురా అమెజాన్ ప్రైమ్ లో విడుదలై సంచలన విజయం సాధించింది. ప్రస్తుతం సూర్య జై భీమ్, వాడి వాసల్ అనే సినిమాల్లో నటిస్తున్నారు. అయితే జైభీమ్ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయింది. తన సొంత బ్యానర్ 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సూర్య ఇందులో లాయర్ గా నటిస్తున్నారు. ఈ మూవీ సామాజిక రాజకీయ అంశాలతో రూపొందుతోంది. దేనికి టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. రాజీషా విజయన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రకాష్ రాజ్ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.

కాగా ఈ సినిమాను ముందుగా థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే తమిళనాడులో ఇప్పటికిప్పుడు థియేటర్లు ఓపెన్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ ఓపెన్ అయినా థియేటర్లకు జనం వస్తారో రారో అన్న భయం ఉంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఓపెన్ అయి సినిమాలు విడుదలైనా ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. దీనిని దృష్టిలో పెట్టుకుని జై భీమ్ సినిమాను కూడా ఓటీటీలో విడుదల చేయాలని ఈ సినిమా మేకర్స్ భావిస్తున్నారట.

ఇప్పటికే ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ కు విక్రయించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో డైరెక్ట్ రిలీజ్ స్ట్రీమింగ్ హక్కులను హక్కులను కూడా అమెజాన్ ప్రైమ్ కే విక్రయిస్తే ఎలా ఉంటుందని జైభీమ్ మేకర్స్ ఆలోచిస్తున్నారు. అతి త్వరలోనే ఈ సినిమా విడుదలపై ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఓటీటీ లోనే విడుదల ఖాయమనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంలో ఎంతమేరకు నిజముందో తెలియాలంటే అధికారికంగా ప్రకటన రావాల్సివుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -