Friday, March 29, 2024
- Advertisement -

తమన్నా స్థానం లో వివాదాస్పద నటి

- Advertisement -

ప్రముఖ దర్శకుడు ఓంకార్ జీనియస్ సినిమా తో పెద్దగా మెప్పించలేకపోయాడు కానీ రాజు గారి గది అనే సినిమా తో మాత్రం అందరి మన్ననలు పొందాడు. ఆ సినిమా విజయవంతం కావడం తో ఓంకార్ వెంటనే దానికి రెండో భాగం కూడా చేసాడు. ఈ రెండో భాగం లో సమంత మరియు నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా పెద్దగా విజయం సాధించకపోయినా ఓపెనింగ్స్ మాత్రం వచ్చాయి. ఇప్పుడు ఓంకార్ మూడో భాగం చేయడానికి తయారు అవుతున్నాడు. తమన్నా ఈ సినిమా లో హీరోయిన్ అని ప్రకటన చేసారు, తమన్నా కూడా సినిమా పూజా కార్యక్రమాలకి హాజరయ్యారు కానీ అనూహ్యం గా ఆవిడ బయటకు వచ్చేసారు కూడా.

అయితే తమన్నా ప్రాజెక్ట్ నుండి వైదొలగడానికి కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు కానీ ఇక రేపో ఎల్లుండో షూట్ కి వెళ్ళాలి అనుకుంటున్నా చిత్ర యూనిట్ కి ఇదొక పెద్ద ఎదురు దెబ్బ. అయితేనేం అనుకోని చిత్ర యూనిట్ ఇప్పుడు తమన్నా ప్లేస్ లో తాప్సి ని అప్రోచ్ అయ్యారట. తాప్సి కూడా సుముఖత వ్యక్తం చేస్తుంది అనే టాక్ ప్రస్తుతం నడుస్తుంది. మరి కొద్దీ రోజుల్లో ఈ సినిమా హీరోయిన్ గురించి ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -